India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామతీర్థం గ్రామం సముద్రతీరాన ఉంది. స్థల పురాణం ప్రకారం.. సీతాన్వేషణకు వెళుతున్నశ్రీరాముడు ఒకరోజు ఈ ప్రాంతానికి వచ్చి సూర్యోదయసమయంలో శివుణి ప్రతిష్ఠించి అర్చన చేశాడు. రాములవారి పాదస్పర్శ ఏర్పడిన ఈక్షేత్రం “రామతీర్థం” గానూ, శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం గనుక శ్రీ రామలింగేశ్వరస్వామి గానూ పూజలందుకుంటున్నాడు. 14వ శతాబ్దంలో పల్లవరాజులు స్వామివారికి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రికఆధారాలు ఉన్నాయి.
మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు నేడు విరామం ఇచ్చారు. తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేసిన ఆయన బుధవారం రాత్రి కూడా సైతం ఇక్కడే బస చేయనున్నారు. రోజంతా శిబిరంలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తిరిగి గురువారం ఉదయం యాత్ర ప్రారంభం కానుంది. శిబిరం నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు.
శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన అండర్- 19 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పుల్లెల శాస్త్రి, హసన్ తెలిపారు. 2005 సెప్టెంబరు 1వ తేదీ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొ న్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆరోజు ఉదయం 9 గంటలకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని చెప్పారు. వివరాలకు 92466 31797 నంబర్కు సంప్రదించాలన్నారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. ఇప్పటికే గిన్నీస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా 6 హెచ్బీ పెన్సిల్ ముల్లుపై, 6 గంటల పాటు శ్రమించి 8మి.మీ వెడల్పు, 20మి.మీ పొడవులో శ్రీరాముడి రూపాన్ని చెక్కారు.
జిల్లాలో 2023 జనవరి 6 నుండి 2024 మార్చి 30 వరకు మొత్తం 337130 ఎపిక్ కార్డులను జనరేట్ చేయగా 314710 ప్రింట్ చేసి జిల్లా కలెక్టర్ నుంచి పోస్టల్ శాఖకు పంపారు. పోస్టల్ ద్వారా 265823 ఓటర్లకు పంపిణీ చేయగా అందులో 12875 రిటర్న్ రావడంతో బిఎల్ఓల ద్వారా 10439 ఓటర్ కార్డులు పంపిణీ చేసారు. బిఎల్ఓ వద్ద 2436, పోస్టల్ శాఖ వద్ద 60,868 ఓటర్ కార్డులు పంపిణీ కి సిద్ధంగా ఉన్నాయి.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవాలకు మండపేటకు చెందిన కేవీఏ.రామారెడ్డి 24 ఏళ్లుగా అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ పరిణయోత్సవం ముగిసిన తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, జి.మామిడాడ, సత్యవాడ, రామతీర్థంలో నిర్వహించే వేడుకలకు ఇస్తారని తెలిపారు.
విజయనగరంలోని ఎత్తు వంతెన సమీపంలో ట్రావెల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గంట్యాడ మండలానికి చెందిన ఎస్ చిమ్మనాయుడు (43) విజయనగరంలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా, విశాఖ వైపు వెళ్తున్న బస్సు వంతెన వద్ద ఢీకొంది. ప్రమాదంలో చిమ్మనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎలుకల మందు తిని యువకుడు మృతిచెందిన ఘటన కొత్తపట్నం మండలం రంగాయపాలెం పంచాయతీ క్రాంతినగర్లో మంగళవారం జరిగింది. SI సాంబశివరావు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి కల్యాణ్ (39) చేపల వేటతో జీవనం సాగిస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు చేసి తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది ఎలుకలు మందు తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
అవనిగడ్డలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు మరో ఇద్దరు యువకులతో కలసి కబడ్డీ క్రీడలో మెలకువలు నేర్పిస్తామని బాలికను లోబరుచుకున్నట్లు సమచారం. ఈ క్రమంలో బాలిక వీడియోలు తీసి, తమకు సహకరించకుంటే వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు తెలుస్తోంది. ఘటనపై డీఎస్పీ మురళీధర్ విచారణ చేస్తున్నారు.
పులివెందుల వ్యవసాయ చీనీ మార్కెట్లో చీనీ కాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే టన్ను ధర రూ.35 వేల నుంచి రూ.40 వేలు పలకడంతో చీనీ సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, పులివెందుల మండలాల్లోని పలు గ్రామాల నుంచి మంగళవారం ఒక్కరోజే 650 టన్నుల చీనీ కాయలు పులివెందుల చీనీ మార్కెట్కు వచ్చినట్లు నిర్వహకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.