India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం అమలు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్పీ తుషార్, ఏఎస్పీలు పాల్గొన్నారు.
రాయచోటిలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ…. మంగళవారం విజయవాడ, ఏపీ సెక్రటేరియట్ లోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి తాగునీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని ఒక పార్లమెంట్, 7అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. చిత్తూరు పార్లమెంటు, నియోజకవర్గ ఎక్స్పెండీచర్ అబ్జర్వర్గా శంకర్రాప్రసాద్, నగరి అసెంబ్లీ, GDనెల్లూరు నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్గా కైలాశ్ వాంఖడే, చిత్తూరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు షాధిక్ అలం, ఎక్సెండీచర్ అబ్జర్వర్గా రోహన్రాఖుర్ నియమితులయ్యారు.
➤ విజయనగరం MP అభ్యర్థి : VZM కలెక్టర్ ఆఫీసు ➤విజయనగరం MLA: విజయనగరం MRO ఆఫీసు ➤ నెల్లిమర్ల MLA: నెల్లిమర్ల MRO ఆఫీసు ➤ చీపురుపల్లి MLA: చీపురుపల్లి MRO ఆఫీసు ➤ S.కోట MLA: S.కోట MRO ఆఫీస్, ➤గజపతినగరం MLA: గజపతినగరం MRO ఆఫీస్ ➤బొబ్బిలి MLA: బొబ్బిలి MRO ఆఫీస్ ➤ అరకు MP: పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్, పార్వతీపురం MLA: పార్వతీపురం MRO ఆఫీసు ➤ సాలూరు MLA: సాలూరు MRO ఆఫీసు ➤ కురుపాం MLA: కురుపాం MRO ఆఫీసు
చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం పెట్రోల్ బంక్ వద్ద ఓ వాహనం ఢీకొని విద్యుత్ లైన్మెన్ మురళీ అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మవరం నుంచి స్వగ్రామం నాగసముద్రం గేట్కు బైక్పై వస్తుండగా. పెట్రోల్ బంక్ దగ్గర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మురళీ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. మురళీ ప్రస్తుతం బసినేపల్లి జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజలు కోడికత్తి రెండవ ఎపిసోడ్ చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ రెడ్డిని ప్రజలు చీకొడుతుండడంతో ఏదో విధంగా సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. గులకరాయి డ్రామా జబర్దస్త్ కామెడీ షో లా ఉందన్నారు. జగన్ రెడ్డి పై విసిరిన రాయి ఇంతవరకు దొరకలేదన్నారు.
శాసనమండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తనయుడు చిట్టి రాజు ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో 833వ ర్యాంక్ సాధించారు. సంతోషం వ్యక్తం చేసిన శాసనమండలి ఛైర్మన్ కుటుంబ సభ్యులు ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టి రాజును పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు.
జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ సేవలను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయ్ రామరాజు సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెళ్లే ప్రతి రిపోర్టును భద్రపరచాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ సాకే జయప్ప(50) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. డి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన సాకే జయప్ప ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం బత్తలపల్లి నుంచి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా బత్తలపల్లి సమీపాన కుక్కను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ఆ ప్రమాదంలో గాయాపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వేద పండితులు ఇవాళ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం శేష వాహన సేవ జరుగుతుంది. 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటలకు కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.