Andhra Pradesh

News April 16, 2024

బాలనాగిరెడ్డి ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నారు: బాలకృష్ణ

image

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్మి కోట్లు సంపాదించారని బాలకృష్ణ విమర్శించారు. మంగళవారం కోసిగిలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో మాట్లాడారు. తుంగభద్ర నది నుంచి ఇసుక తవ్వి అభివృద్ధిని మరిచారని అన్నారు. అక్రమ మద్యం, కల్తీ సారాయి అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆలోచించి TDP అభ్యర్థి రాఘవేంద్రని గెలిపించాలని కోరారు.

News April 16, 2024

శ్రీకాకుళం: ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ

image

ఈనెల 18వ తేదీ నుంచి సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులందరూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మంగళవారం BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై మీనా సమీక్షించారు.

News April 16, 2024

నామినేషన్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి:కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 18 నుంచి మొదలయ్యే నామినేషన్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీసీ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ సత్యనారాయణరావు, వివిధ విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.

News April 16, 2024

విజయనగరం రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

image

ఎలక్షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్‌లో భాగంగా మంగళవారం విజయనగరం రైల్వే స్టేషన్‌లో విశాఖ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ కే.వెంకట్రావు నేతృత్వంలో జీఆర్పీ ఎస్ఐ రవివర్మ, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్లాట్ ఫారం నెం-1లో గంజాయిని గుర్తించారు. మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన ఇద్దరిని తనిఖీ చేసి.. వారి వద్ద నుంచి 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 16, 2024

శ్రీకాకుళం: విజయం మనదే: ఎంపీ

image

రానున్న ఎన్నికలలో జయం మనదేనని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో యువనాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పలాస సభ ముగించుకుని మంగళవారం తిరుగుప్రయాణం అయిన చంద్రబాబు హెలికాప్టర్ ఎక్కిన సమయంలో రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. కొన్ని నిమిషాల పాటు వారి మద్య మాటామంతి కొనసాగింది. చంద్రబాబు తిరుగుప్రయాణం అయినప్పుడు రామ్మోహన్ నాయుడు విక్టరీ సింబల్ చూపించి జయం మనదేనని ధీమాను వ్యక్తం చేశారు.

News April 16, 2024

సివిల్స్ ఫలితాల్లో శరత్ చంద్ర IAS అకాడమీ అభ్యర్థుల ప్రతిభ

image

సివిల్స్ ఫలితాల్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, విజయవాడ బ్రాంచీల అభ్యర్థులు సత్తాచాటారని డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. అనన్య రెడ్డికి ఆల్ ఇండియా 3వ ర్యాంకు, రుహానికి 5వ ర్యాంకుతో పాటు 16, 19, 42, 61, 91వ ర్యాంకులు వచ్చాయని చెప్పారు. దాదాపు 50కి పైగా IAS, IPS, ఐఆర్ఎస్ వంటి ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని ఆయన చెప్పారు. ఇందులో 19 ర్యాంకులు తెలుగు విద్యార్థులకు వచ్చాయన్నారు.

News April 16, 2024

చిత్తూరు: SPని ఆశ్రయించిన ప్రేమజంట

image

చిత్తూరు : ప్రేమ పెళ్లి చేసుకున్నాం రక్షణ కల్పించండని అని ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ మణికంఠను ఆశ్రయించారు. పెనుమూరు మండలం ఎగువ పూనేపల్లి గ్రామానికి చెందిన మౌలాలి కుమార్తె జాస్మిన్, తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చారాల దళితవాడకు చెందిన మురుగేశ్ కుమారుడు తిరుమలేష్ మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త తిరుమలేశ్ ఎస్సీ కులస్తుడు కావడంతో మా తల్లిదండ్రులు అడ్డుపడ్డారని ఆమె వాపోయారు.

News April 16, 2024

అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు – జిల్లా ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా తగిన రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నవాబ్ పేట పరిధిలో 5 లక్షలు, అల్లూరు పరిధిలో 1,85,500, మనుబోలు పరిధిలో లక్ష, బుచ్చి పరిధిలో 3 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 16, 2024

శ్రీశైలంలో ఆగమ పాఠశాలలో ప్రవేశ పరీక్షలు

image

శ్రీశైలంలోని వీరశైవ ఆగమ పాఠశాలలో మంగళవారం వార్షిక పరీక్షలు నిర్వహించినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మంగళవారం శ్రీశైలంలో ఆగమ పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. అర్చక ప్రవేశ, వర, ప్రవర కోర్సులకు సంబంధించి ఆగమ పరీక్షలు జరిగాయన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 115మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. రేపటితో పరీక్షలు ముగుస్తాయన్నారు.

News April 16, 2024

కర్నూలు కిమ్స్‌లో తొలిసారిగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ

image

క‌ర్నూలు జిల్లాలోని కొండాపురం గ్రామానికి చెందిన స‌త్యనారాయ‌ణ రాజు దీర్ఘకాల కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వ్యక్తికి గుండెల్లో స‌మ‌స్య త‌లెత్తింది. ఈ కేసులో రిస్క్ ఎక్కువ ఉండ‌టంతో యాంజియోప్లాస్టీ చేసేందుకు కొంద‌రు వైద్యులు అంగీక‌రించ‌లేదు. క‌ర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఈ రోగికి విజ‌య‌వంతంగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ చేశారని కార్డియాల‌జిస్టు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.