India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కురిచేడులోని తాగునీటి చెరువులో నవజాత శిశువు మృతదేహం పడేసిన విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఎస్సై చెప్పారు. ఎవరు ఆ మృతదేహాన్ని చెరువులో పడేశారు. అసలు మృతదేహం ఎలా వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. శ్రీకాకుళం జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో 26 జిల్లాలకు కేటాయించాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. ఐతే మంత్రి రేసులో అచ్చెన్న, కూన, అశోక్లు ఉన్నట్లు సమాచారం.

మండలంలోని చిలువూరుకి చెందిన టీడీపీ కార్యకర్త ఖాసిం(24) హత్య కేసులో నిందితులుగా ఉన్న తుమ్మపూడికి చెందిన నలుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు దుగ్గిరాల ఎస్ఐ బి.మహేంద్ర తెలిపారు. హర్షవర్ధన్, హృదయరాజు, కమల తేజ, రవీంద్రబాబులకు తెనాలి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. టీడీపీ గెలిచిందని సంతోషంలో ఉన్న ఖాసిం తలపై 4న బ్యాట్తో దాడి చేయగా, శుక్రవారం మరణించినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ఏలూరు జిల్లా పోలవరం మండలం ఉడతపల్లి అటవీప్రాంతంలో చిరుతపులి దాడి చేయడంతో ఐదు మేకలు చనిపోయాయి. ఈ ఘటనపై పోలవరం ఇన్ఛార్జి రేంజర్ దావీదు రాజు మాట్లాడుతూ.. గ్రామానికి దూరంగా పొలాల్లో చుండ్రు బుల్లెబ్బాయి మేకల మందను కట్టినట్లు తెలిపారు. నిత్యం అక్కడే మకాం ఉండే అతడు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఘటన జరిగిందన్నారు. చిరుత కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్ పదవికి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కోలా గురువులు రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీ పరంగా వచ్చిన ఈ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన రాజీనామా లేఖను రాష్ట్ర సహకార శాఖ కమిషనర్కు పంపారు. వ్యక్తిగత కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు.

గజపతినగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడి తల్లిని చేసిన యువకుడిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఆమె కళాశాలకు వెళ్లి వచ్చినప్పుడు అతను లోబర్చుకున్నట్లు తెలుస్తోందని, గర్భవతి అయినట్లు తెలియకుండా కాన్పు జరగడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశామన్నారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక నుంచి రావులపాలెం వెళ్ళే రహదారిలో ఈనెల 8, 9 తేదీల్లో ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రావులపాలెం సీఐ ఎం.రామకుమార్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ నిమిత్తం ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు చెప్పారు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వైపు వచ్చే వాహనాలు ధవళేశ్వరం బ్యారేజ్ దాటుకుని వేమగిరి, కడియం, జొన్నాడ – రావులపాలెం చేరుకోవాలన్నారు

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈ నెల 12న జరగనున్న చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గన్నవరం విమానాశ్రయ సమీపంలోని కేసరపల్లి IT పార్క్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న సభాస్థలి వద్ద ఏర్పాట్లను టీడీపీ నేతలతో కలసి పరిశీలించారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని అచ్చెన్న తెలిపారు.

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్వామివారి ఆలయంలో ఒక్కో లడ్డుకు 50 రూపాయలు చెల్లించి స్వామివారి ప్రసాదాన్ని పొందవచ్చని తెలిపారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

జరిగిన ఎన్నికల ఫలితాలపై పార్టీ అభిమానులు, కార్యకర్తలు సంయమనంగా వ్యవహరించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. దాడులు, ప్రతి దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గెలుపోటములపై ఆగ్రహవేశాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ అనంతరం కొన్నిచోట్ల అల్లర్లు జరిగాయని వస్తున్న సోషల్ మీడియా కథనాలపై ఆయన స్పందించారు.
Sorry, no posts matched your criteria.