India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల18వ తేదీ నుంచి 30 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.విజయ కుమార్ శనివారం తెలిపారు. విద్యార్థులు ఇంటి వద్ద నుంచి పరీక్ష కేంద్రం వరకు అన్ని పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ భారీ మార్పులు చేసింది. ఉమ్మడి గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 9 స్థానాలకు అభ్యర్థులను మార్చింది. తాడికొండ, మంగళగిరి, వేమూరు, పొన్నూరు, రేపల్లె, పత్తిపాడు, చిలకలూరిపేట, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మాచర్ల, నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండలో పాత అభ్యర్థులనే పోటీకి ఉంచింది.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి తదుపరి జరగబోయే స్పందన కార్యక్రమం తేదీని ప్రకటిస్తామన్నారు. ఇందుకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు.
అనకాపల్లి MP అభ్యర్థి పేరును వైసీపీ పెండింగ్ పెట్టింది. కూటమి అభ్యర్థిగా BJP నుంచి సీఎం రమేశ్ ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరగడంతో ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషిస్తున్నట్లు సమాచారం. మాడుగుల MLA అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును MP అభ్యర్థిగా ప్రకటించి, అక్కడ నుంచి బూడి కుమార్తె, ZPTC ఈర్ల అనురాధని పోటీ పెడతారని ప్రచారం జరుగుతోంది. మరి వైసీపీ అభ్యర్థిగా ఆ బీసీ నేత ఎవరి మీరు భావిస్తున్నారు?
ప.గో. జిల్లాలో వైసీపీ అభ్యర్థుల చదువులు ఇలా..
చెరుకువాడ శ్రీరంగనాథరాజు- 9వ తరగతి
కొట్టు సత్యనారాయణ – ఇంటర్
గుడాల శ్రీహరిగోపాల రావు – బీకాం
పెన్మెత్స వెంకట లక్ష్మీ నర్సింహరాజు – బీఏ
గ్రంథి శ్రీనివాస్ – ఇంటర్
ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు – ఇంటర్
ఆళ్ల నాని – బీకాం
తానేటి వనిత – MSC (PHD)
అబ్బయ్య చౌదరి – బీటెక్
కంభం విజయరాజు – BA, ఎల్ఏఈ
తెల్లం రాజ్యలక్ష్మి- BA, బీఈడీ
పుప్పాల శ్రీనివాసరావు – డిగ్రీ
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఆ నంబర్కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే వైసీపీ మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గెలిచిన 9 మందిలో బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొరకి జగన్ కేబినెట్లో చోటు ఇచ్చారు. కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. శంబంగి చినఅప్పలనాయుడు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపుపై మీ కామెంట్
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 19వ తేదీన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో నిర్వహించనున్న వైసీపీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. స్థానిక ఆకుల వీర్రాజు విగ్రహం వద్ద మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుందని కొత్తపేట MLA, వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.
ఎన్నికల్లో బరిలో నిలిచే నాయకుల జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే..ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నిన్నటి నుంచి 57రోజుల పాటు ప్రిపరేషన్ (ప్రచారానికి) సమయం. మే 13న పరీక్ష(ఓటింగ్). ఆ తర్వాత 22 రోజులకు జూన్ 4న ఫలితాలు. ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 స్థానాలకు(పోస్టులకు) ఎంతమంది పరీక్ష రాస్తారన్నది తేలాలి. ఏప్రిల్ 25 వరకు పరీక్షకు అప్లై (నామినేషన్) చేసుకోనున్నారు.
అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేలా పోలీస్ అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.పరీక్షా కేంద్రాలు వద్ద జన సమూహాలు ఉండకూడదన్నారు.
Sorry, no posts matched your criteria.