India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏలూరు జిల్లా పోలవరం మండలం ఉడతపల్లి అటవీప్రాంతంలో చిరుతపులి దాడి చేయడంతో ఐదు మేకలు చనిపోయాయి. ఈ ఘటనపై పోలవరం ఇన్ఛార్జి రేంజర్ దావీదు రాజు మాట్లాడుతూ.. గ్రామానికి దూరంగా పొలాల్లో చుండ్రు బుల్లెబ్బాయి మేకల మందను కట్టినట్లు తెలిపారు. నిత్యం అక్కడే మకాం ఉండే అతడు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఘటన జరిగిందన్నారు. చిరుత కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్ పదవికి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కోలా గురువులు రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీ పరంగా వచ్చిన ఈ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన రాజీనామా లేఖను రాష్ట్ర సహకార శాఖ కమిషనర్కు పంపారు. వ్యక్తిగత కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు.

గజపతినగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడి తల్లిని చేసిన యువకుడిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఆమె కళాశాలకు వెళ్లి వచ్చినప్పుడు అతను లోబర్చుకున్నట్లు తెలుస్తోందని, గర్భవతి అయినట్లు తెలియకుండా కాన్పు జరగడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశామన్నారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక నుంచి రావులపాలెం వెళ్ళే రహదారిలో ఈనెల 8, 9 తేదీల్లో ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రావులపాలెం సీఐ ఎం.రామకుమార్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ నిమిత్తం ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు చెప్పారు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వైపు వచ్చే వాహనాలు ధవళేశ్వరం బ్యారేజ్ దాటుకుని వేమగిరి, కడియం, జొన్నాడ – రావులపాలెం చేరుకోవాలన్నారు

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈ నెల 12న జరగనున్న చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గన్నవరం విమానాశ్రయ సమీపంలోని కేసరపల్లి IT పార్క్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న సభాస్థలి వద్ద ఏర్పాట్లను టీడీపీ నేతలతో కలసి పరిశీలించారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని అచ్చెన్న తెలిపారు.

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్వామివారి ఆలయంలో ఒక్కో లడ్డుకు 50 రూపాయలు చెల్లించి స్వామివారి ప్రసాదాన్ని పొందవచ్చని తెలిపారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

జరిగిన ఎన్నికల ఫలితాలపై పార్టీ అభిమానులు, కార్యకర్తలు సంయమనంగా వ్యవహరించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. దాడులు, ప్రతి దాడులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గెలుపోటములపై ఆగ్రహవేశాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ అనంతరం కొన్నిచోట్ల అల్లర్లు జరిగాయని వస్తున్న సోషల్ మీడియా కథనాలపై ఆయన స్పందించారు.

పెనుగొండకు చెందిన పలువురు వార్డ్ మెంబర్లు పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారందరికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. వైసీపీ అనే మునిగిపోయే నావ నుంచి ముందే వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆచంట నియోజకవర్గంలో ప్రతీ గ్రామం అభివృద్ధి చెందాలన్నదే తన ధ్యేయమన్నారు.

నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ.. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను అందరి సమస్వయంతో దిగ్విజయంగా పూర్తి చేసిన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఇంతకన్నా మెరుగ్గా విజయవాడ నగరానికి సేవలందిద్దామని శుక్రవారం నగర క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు. ఏపీ, ఎస్సీ ఎన్జీవోస్లో ఖాళీ అయిన పదవులు కో ఆప్షన్ పద్ధతిలో.. ఎన్నిక కాబడిన నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్, రాజశేఖర్, శ్రీనివాసరావు, ఎస్.కె నజరుద్దీన్, బిఎస్ఎన్ శ్రీనివాస్ సంఘ నాయకులతో కలసి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఢిల్లీ రావుకు పుష్పగుచ్చం అందజేశారు.
Sorry, no posts matched your criteria.