India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా అధికారులు పనిచేయాలని జిల్లా ఎస్పీ తుషార్ శుక్రవారం ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతE చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసును నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి శుక్రవారం కోరారు. అత్యవసర సమయంలో రక్తం లభించక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈమేరకు ఈనెల 9,10,11వ తేదీల్లో జరగనున్న మోదకొండమ్మ పండుగ సమయంలో పాడేరు సబ్ కలెక్టర్ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ధాత్రి తెలిపారు. ఆసక్తి గల వారు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రిజం -10 ప్రాజెక్ట్ను పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి కమిటి జిల్లాకు శుక్రవారం వచ్చింది. క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న పరిస్థితిని కమిటీ పరిశీలిస్తోంది. కమిటీ సభ్యులుగా డీఓపీటీ డైరెక్టర్ మొలాయ్ శాన్యాల్, బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ ( సీపీడీ) సుదర్శన్ భగత్ జిల్లాకు చేరుకున్నారు. శనివారం గ్రామాల్లో పర్యటించనున్నారు.

నగరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గాలి భానుప్రకాశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం ఉండవల్లి నివాసంలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను గాలి భానుప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గాలి భానుప్రకాశ్ మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించనున్నట్లు వెల్లడించారు.

టీడీపీ జైత్రయాత్రలో భాగస్వామి అయినందుకు యువ సినీ హీరో, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అల్లుడు సిద్ధార్థ్ నిఖిల్ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. శుక్రవారం మాలకొండయ్యతో కలిసి నిఖిల్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేశ్ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్తో లోకేశ్ సరదాగా ముచ్చటించారు. సినిమాల్లో హీరో మాదిరే రియల్గా ప్రజలకు మేలు చేయాలన్నారు.

తణుకు పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు తణుకు బ్రాంచిలో మేనేజర్గా పని చేస్తున్న రూపాదేవి శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి బ్యాంక్కు స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపాదేవి తలకు గాయం కావడంతో తొలుత తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించారు.

ప్రొద్దుటూరుకు చెందిన పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు YCP ఓటమితో శుక్రవారం రాజీనామా చేశారు. నగర కార్పొరేషన్ డైరెక్టర్ మురళి,ఆరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరి, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రవిచంద్ర, పూసల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, నాటక అకాడమీ డైరెక్టర్ లక్ష్మీదేవి రాజీనామా చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ(2017-18 రెగ్యులేషన్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు టైం టేబుల్, ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.

దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు ఢీకొనగా గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు విజయనగరం రైల్వే ఎస్సై రవివర్మ తెలియజేశారు. రైలు పట్టులు దాటుతుండగా మృతి చెందినట్లు చెప్పారు. గూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 12 ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నేతలు టీడీ జనార్దన్, అచ్చెన్నాయుడు తదితరులు శుక్రవారం కేసరపల్లిలో ఎంపిక చేసిన సభాస్థలాన్ని పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.