India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంత్రి నారా లోకేశ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు భారీగా విమానాశ్రయానికి చేరుకున్నారు.

ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సాగుతున్న నేపథ్యంలో రైతుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ గోపాలకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కంట్రోల్ రూము నంబర్ 8008901457ను సంప్రదించాలన్నారు. వాట్సాప్ నంబర్ 7337359375కు మెసేజ్ చేయాలని జేసీ సూచించారు.

ప.గో. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులకు నిరాశ ఎదురైంది. జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సర్వేలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ రావు పేరును బీసీ కోటాలో పరిశీలించారు. అయినప్పటికీ వీరు ఇరువురికీ పదవి దక్కలేదు. చివరికి మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు కట్టబెట్టారు.

తణుకు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పాత టోల్ గేట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం.

తల్లిదండ్రులు లేని పిల్లలను సొంత పిల్లలుగా భావిస్తూ వారిని తీర్చిదిద్దాలని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు JC గోపాలకృష్ణ సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. అనాథలైన పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు సమకూర్చాలన్నారు. 18ఏళ్లు దాటిన పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందించాలని సూచించారు.

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో అఖరి రోజు కావడంతో శుక్రవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో శోభారాణి అని ఏర్పాట్లు చేశారు. ఆలయావరణంలో ప్రత్యేక ప్రసాదం కౌంటర్లను అందుబాటులో ఉంచారు.

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.

సీఎం చంద్రబాబు వివిధ ర్యాంకులు ప్రకటించగా మన జిల్లా చాలా వాటిలో వెనుకబడింది. ఒంగోలు కార్పొరేషన్తో పాటు 6మున్సిపాల్టీల్లో రూ.71.19 కోట్ల పన్నులు రావాల్సి ఉండగా రూ.37.11 కోట్లే వసూళ్లు చేశారు. దీంతో రాష్ట్రంలో జిల్లా 19వ స్థానంలో నిలిచింది. నీటి పన్ను రూ.27.10 కోట్లు కాగా రూ.3.64కోట్ల వసూళ్లతో 22వ ర్యాంకు లభించింది. గ్రామీణ ఇళ్లు, స్థలాల స్వామిత్ర సర్వేలో మాత్రం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

PGRS వినతుల పరిష్కారంలో చిత్తూరు జిల్లా వెనుకబాటులో ఉంది. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు నివేదిక వెలువడింది. నిర్దేశించిన గడువులో వాటిని పరిష్కరించకపోవడంతో ఈ విభాగంలో జిల్లా 7.27%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. అర్జీల రీ ఓపెన్లో 14.52 శాతంతో మూడో స్థానంలో ఉంది. LPM తిరస్కరణలో 28.85 శాతంతో మూడో స్థానంలో ఉంది.

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.28, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.42, బెండ రూ.54, మిర్చి రూ.44, బీరకాయ రూ.62, కాలిఫ్లవర్ రూ.26, కాకరకాయ రూ.60, చిలకడ దుంప రూ.34, దొండకాయ రూ.42, క్యారెట్ రూ.38, చిక్కుడుకాయ రూ.60, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.50, బీన్స్ పిక్కలు రూ. 125, పొటల్స్ రూ.54, క్యాప్సికం రూ.44గా ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.