India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతి మూడవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందర్నీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుంచి పదవ తరగతి పరీక్షలు, స్వచ్ఛ ఆంధ్ర, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్, ప్రజల సంతృప్తి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
➤ఆదోని ఘటనపై సీఎం, మంత్రుల దిగ్భ్రాంతి
➤ మహిళపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు
➤ హీరో బైక్ గెలుచుకున్న కర్నూలు యువకుడు
➤ ఆదోనిలో సంచలనంగా ఈశ్వరప్ప మృతి
➤ ఇంటర్ పరీక్షలు.. ఇద్దరు విద్యార్థుల డిబార్
➤ పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్.. గుంటూరుకు తరలింపు
➤ విద్యార్థులను మోసం చేసింది చంద్రబాబే: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
➤ రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఆపండి
జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పీపీ మోడల్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, బీచ్ టూరిజం , టెంపుల్ టూరిజం, క్రింద ఎవరైనా ముందుకు వస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.
ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.
మచిలీపట్నం కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ కే చంద్రశేఖరరావు, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవితో కలిసి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పురోగతి, రీ సర్వే, గ్రామ, వార్డు సచివాలయాల సేవలు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్, అర్బన్, పీఎం జన్మన్ పథకాల కింద గతంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిందని కలెక్టర్ అంబేడ్కర్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తుందన్నారు.
పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం గజవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన Sr.అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. ఇంక్రిమెంట్ల, ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్లో పనిచేస్తే అటెండర్, కుక్ల నుంచి రూ.25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా టంగుటూరు మండలానికి చెందిన గడ్డం కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ నారాయణ తెలిపారు. ఒంగోలులోని టీటీడీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఏన్నికల్లో 38 మండలాలకు చెందిన మండల సమాఖ్య అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.