Andhra Pradesh

News April 16, 2024

వైసీపీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎస్సీ మోహన్ రెడ్డి

image

సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ రీజినల్ కో- ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొంది.

News April 16, 2024

భావనపాడు వరకు రోడ్డు సౌకర్యం: చంద్రబాబు

image

విశాఖపట్నం నుంచి భావనపాడు వరకు సముద్రతీర ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపడతామని, బీచ్‌ని అభివృద్ధి చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలాస పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జీడి రైతుకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. డీఎస్సీ ఫైల్ పైనే మొదటి సంతకం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పాల్గొన్నారు.

News April 16, 2024

ముగ్గురు వ్యక్తులు.. 5 వెహికిల్స్‌కే ఛాన్స్: కలెక్టర్

image

మార్చి 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడానికి ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్లు 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ప్రతిరోజు రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ స్వీకరిస్తామని అన్నారు. నామినేషన్ వేసేటప్పుడు ముగ్గురు వ్యక్తులను, ఐదు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అన్నారు.

News April 16, 2024

శ్రీకాకుళం జిల్లాలో పీడబ్ల్యూడీ ఓటర్లు@21,481

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజక వర్గాల వారిగా జిల్లాలో పీడబ్ల్యూడీ ఓటర్లు 21,481 ఉండగా.. జిల్లాలో 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు 11,485 ఓటర్ల ఉన్నట్లు కలెక్టర్ మంజీర జిలానీ సమూన్ పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్నాయా లేదని రిటర్నింగ్ అధికారులను అడుగగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్లు ఆర్ఓలు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News April 16, 2024

అనకాపల్లి: ‘వైసీపీ పాలనలో అంతులేని అవినీతి’

image

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి కనిపించలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఈ మేరకు అనకాపల్లి గవరపాలెంలోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నియోజకవర్గంలో గత ఎన్నికలలో అమర్నాథ్‌ను గెలిపించి తప్పు చేశామని, ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

News April 16, 2024

18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల : కర్నూలు కలెక్టర్

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 18వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు, అదే రోజు 11నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సంబంధిత కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలను అందుబాటులో ఉంచామన్నారు.

News April 16, 2024

ఉమ్మడి తూ.గో ఓటర్ల తీర్పు ఏంటో..?

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే నానుడి ఉంది. 2009లో కాంగ్రెస్-11, పీఆర్‌పి- 4, టీడీపీ-4 చోట్ల విజయం సాధించాయి. 2014లో టీడీపీ-13, వైసీపీ-5, ఇండిపెండెంట్-1 గెలిచాయి. 2019లో వైసీపీ-14, టీడీపీ-4, జనసేన-1 సీటు గెలిచాయి. మరి 2024లో ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందో కామెంట్ చేయండి.

News April 16, 2024

చిత్తూరు: సౌండ్ ఎక్కువ ఉన్న ప్రచార వాహనాలు సీజ్ చేయాలి

image

సౌండ్ ఎక్కువ ఉన్న ప్రచార వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. సోమవారం ఆర్వోలు , ఏఆర్ఓలు , నోడల్ అధికారులతో సోమవారం  సమావేశం నిర్వహించారు. ఇంటింటి ప్రచారాలపై ముందస్తుగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలపై అధికారులు పరిశీలించాలన్నారు.

News April 16, 2024

18 నుంచి నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

ఈనెల 18వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ఎన్నికల అధికారి హరినారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.

News April 16, 2024

16న కోదండరామనికి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్పణ

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయని ఆలయ అధికారులు సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 16న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.