India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాలకు చెందిన రేణుక కడప జిల్లా రాజంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రేణుక సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తీసి చూడగా ఉరివేసుకుని చనిపోయినట్లుగా గుర్తించామని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఆత్మహత్యకు గల కరణాలు తెలియాల్సి ఉంది.
రేపు కోసిగిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారని జిల్లా TDP అధ్యక్షులు BT నాయుడు తెలిపారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఈనెల 16న సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా TDP అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.
రామచంద్రాపురం మండలంలోని 23 పంచాయతీల పరిధిలో 130 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో ప్రత్యూషకు అందజేశారు. ప్రతిపక్షాలు తమపై ఆరోపణలు చేయడం బాధించాయని తెలిపారు.
పర్చూరులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు నుంచి పెద్దివారిపాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న రావి విజయ భాస్కర్ని ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన ఇరువురిని 108లో గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో విజయ భాస్కర్ మృతి చెందగా, మరొక వ్యక్తి చికిత్స పొందుతున్నారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సోమవారం రాత్రి ముగిసిన వెంటనే ఆయన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద రాత్రి బస చేస్తారు. ఈ నేపథ్యంలో నారాయణపురంలో సీఎం బసకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడప: యోగి వేమన యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల1, 2, 4, 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్ (2023- 24), బ్యాచ్, 2వ సెమిస్టర్ (2016-17), (2020-21), (2023-24) బ్యాచ్ లు, 4వ సెమిస్టర్ (2016-17), (2023-24) బ్యాచ్, 6వ సెమిస్టర్ (2016-17) విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు.
పొన్నూరు పట్టణ శివారు జీబీసీ రోడ్లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ప్రశాంత్(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక యువకుడు మన్సూర్కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పొన్నూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం అత్యవసర సేవలందిస్తున్న శాఖల లో పని చేస్తున్న ఉద్యోగుల, ఎన్నికల విధులలో పాల్గొంటున్న పాస్ లు పొందిన మీడియా వారి కి ఓటింగ్ కోసం పోస్టల్ బ్యాలెట్ ను అందించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అత్యవసర సేవలను అందించే అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసారు.
ఎన్నికల వ్యయానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు పక్కా రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఆర్.వో., జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. నామినేషన్లు వేసిన రోజు నుంచి అభ్యర్థుల ఖాతాల్లో వ్యయానికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తామని వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ధర్మవరం పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన కే.మహబూద 465/470 మార్కులతో సత్యసాయి జిల్లా రెండవ ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ మెుదటి సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించింది. విద్యార్థిని మహబూద మాట్లాడుతూ.. ఇంజినీర్ కావడమే లక్ష్యంగా తన చదువును కొనసాగిస్తానని తెలిపారు.
Sorry, no posts matched your criteria.