Andhra Pradesh

News June 7, 2024

ఏలూరు: చూసి నవ్వినందుకు.. కత్తిపోట్లు

image

నూజివీడులో నిన్న <<13390710>>కత్తిపోట్ల<<>> ఘటన కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు..నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయికిరణ్, సుధీర్‌ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్‌ వచ్చి గిరీష్‌ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.

News June 7, 2024

విశాఖ: వందే భారత్ రైళ్లకు మంచి స్పందన

image

విశాఖ నుంచి నడుస్తున్న మూడు వందే భారత్ రైళ్లకు మంచి స్పందన లభిస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ, విశాఖ-భువనేశ్వర్-విశాఖ మధ్య మొత్తం మూడు వందే భారత్ రైళ్లు ప్రతిరోజు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తయారైన ఈ రైళ్లలో మధ్యతరగతి ప్రయాణికులు సైతం ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 7, 2024

విశాఖ మేయర్ పీఠంపై కూటమి గురి..?

image

విశాఖ నగరం మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. GVMCలో 98 స్థానాలకు ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో TDPకి 29, జనసేనకి 3, BJP, CPM, CPIలకు ఒక్కొక్కరు, 5 స్వతంత్ర కార్పొరేటర్లు ఉన్నారు. మిగతా 57 మంది YCP కార్పొరేటర్లు. YCPలో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటే మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవచ్చని చర్చ జరుగుతోంది.

News June 7, 2024

రాష్ట్రంలోనే అత్యల్ప ‘నోటా‘ ఓట్లు.. మన కర్నూలుకే

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోనే కర్నూలు అసెంబ్లీ స్థానంలో ‘నోటా’(పై వారెవరూ కాదు)కు తక్కువ ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా నోటా ఓట్లు పోలైన స్థానాల్లో కేవలం 718 ఓట్లతో కర్నూలు అసెంబ్లీ రెండో స్థానంలో నిలిచింది. కాగా విశాఖ దక్షిణం 631 ఓట్లతో మెుదటి స్థానంలో ఉంది.

News June 7, 2024

YCP మాజీ MLA ఆర్కే స్వగ్రామంలో TDPకి మెజారిటీ

image

రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాజీ MLA ఆర్కే స్వగ్రామం పెదకాకానిలో TDPకి మెజారిటీ వచ్చింది. ఆళ్ల కుటుంబం ఓటు వేసిన పోలింగ్ కేంద్రం 32లో కూడా ధూళిపాళ్ల నరేంద్ర 201 ఓట్ల ఆధిక్యం సాధించారు. పొన్నూరు పరిశీలకుడిగా RK వ్యవహరించినా టీడీపీకి 32,915 ఓట్ల మెజారిటీ దక్కిందని TDP నేతలు చెబుతున్నారు. 2019లో పెదకాకాని మండలంలో YCPకి 1650 మెజారిటీ రాగా, నేడు టీడీపీకి 10వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు.

News June 7, 2024

విజయనగరంలో 30 ఏళ్ల క్రితం టీడీపీ క్లీన్ స్వీప్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో సరిగ్గా 30 ఏళ్ల క్రితం టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 1994లో జరిగిన ఎన్నికల్లో నాగూరు, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, తెర్లాం, గజపతినగరం, విజయనగరం, చీపురుపల్లి, సతివాడ, భోగాపురం, ఉత్తరావల్లి, ఎస్.కోటలో టీడీపీ అభ్యర్థులు గెలిపొందారు. నాగూరు, సతివాడ నియోజకర్గాలు కురుపాం, సతివాడగా మారగా.. తెర్లాం, భోగాపురం, ఉత్తరావల్లి నియోజకర్గాలు పునర్విభజనలో రద్దయ్యాయి.

News June 7, 2024

హొలగుంద: టీబీ డ్యాంకు పెరిగిన ఇన్ ఫ్లో

image

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ ఫ్లో గురువారం పెరుగుతోంది. బుధవారం ఇన్ ఫ్లో 517 క్యూసెక్కులు ఉండగా గురువారం 1,670 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 3.706 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో 10 క్యూసెక్కులు (అవుట్లో ) రాయబసవన కెనాల్‌కు వదులుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 5.029 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని తెలిపారు.

News June 7, 2024

అవినీతి సొమ్ముని కక్కిస్తా: కడప ఎమ్మెల్యే

image

కడప అభివృద్ధికి అంజాద్ బాషా వెచ్చించానని చెబుతున్న రూ.2 వేల కోట్లకు లెక్క తేల్చాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. 5 ఏళ్ల కాలంలో తిన్న అవినీతి సొమ్ముని కక్కించి, కబ్జా చేసిన పేదల భూములను పేదలకు పంచి పెడతానన్నారు. ఎన్నికలకు ముందు జగన్ కడపలో తన ముఖం చూసి ఓట్లు వేయమన్నారని.. ఇక్కడ అంజాద్ బాషాను ఓడించామంటే జగన్‌ను ఓడించినట్లే అని ఎద్దేవా చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా టీడీపీ జెండా ఎగరేశామన్నారు.

News June 7, 2024

పవన్‌పై తమన్నా సింహాద్రి పోటీ.. ఓట్లు ఎన్నంటే..?

image

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు 247 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసిన 13 మందిలో ఈమెకు వచ్చిన ఓట్లే అతి తక్కువ. ఇక పవన్‌ 1,34,394 ఓట్లు సాధించి.. 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

News June 7, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాలు విడుదల

image

డా.బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్ ఫలితాలను డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో 10,822 మంది విద్యార్థులకు 5,316 మంది ఉత్తీర్ణత (49.12శాతం) సాధించారని తెలిపారు. పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్ సైట్‌లో పొందుపరిచామని, పునఃమూల్యాంకనం కొరకు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.