Andhra Pradesh

News June 7, 2024

మార్టూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

మార్టూరులోని శ్రీవిగ్నేశ్వర కూరగాయల మార్కెట్ సమీపంలోని తండాలో నివాసం ఉంటున్న మూడావత్ బాలనాయక్ (60) అనుమానాస్పదంగా గురువారం మృతి చెందాడు. బాలనాయక్ వ్యవసాయ పనులు చేసుకుంటూ వైసీపీ సానుభూతి పరుడిగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేయడం వల్లే కక్ష్యతో బాలనాయక్‌ను హత్య చేసి వేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News June 7, 2024

విశాఖ: మత్తు పదార్థాలతో ఇద్దరు అరెస్ట్

image

ఎండీఎంఏ(మిథైలెన్డియోక్సి మెథాంపేటమిన్) డ్రగ్‌ను కలిగి ఉన్న ఇద్దరు యువకులను మహారాణిపేట పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 3.316 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. టర్నల్ చౌల్ట్రీ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎం.సాయిరాం, టీ.సంగ్రామ్ సాగులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా డ్రగ్స్ లభించాయి.

News June 7, 2024

నెల్లూరు జిల్లాలో NOTAకి పడిన ఓట్లు ఇవే..!

image

➤ నెల్లూరు సిటీ: 967
➤ కోవూరు: 2,377
➤ కావలి: 2,030
➤ ఆత్మకూరు: 2,347
➤ నెల్లూరు రూరల్: 2,016
➤ ఉదయగిరి: 2,072
➤ వెంకటగిరి: 3,037 ➤ గూడూరు: 3,129
➤ సూళ్లూరుపేట: 3,423 ➤ సర్వేపల్లి: 2,057
➤ మొత్తం: 23,455

News June 7, 2024

ఏలూరు: LOVERతో కలిసి భర్తను చంపేసి

image

లింగపాలెం మండలం వేములపల్లికి చెందిన చట్టిమాల ఆశీర్వాదం(34) JCB డ్రైవర్. భార్య సుమలత పెదవేగి మండలం కొప్పాకకు చెందిన నాగరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో భర్తకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ప్రియుడితో కలిసి ఉరేసి చంపింది. అతడే ఆత్మహత్య చేసుకున్నట్లు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఫోన్‌‌లో ప్రియుడితో ఉన్న ఫొటోలు బయటకు రాగా విషయం వెలుగులోకి వచ్చింది. హత్యచేసినట్లు ఒప్పుకోగా కేసు నమోదైంది.

News June 7, 2024

చిత్తూరు: పెద్దిరెడ్డితో కమిటీ ఏర్పాటు

image

దాడుల నుంచి కాపాడి కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయం కమిటీలను ఏర్పాటు చేసింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్, ఆర్కే రోజా, సునీల్ కుమార్, వెంకటేగౌడ, రెడ్డెప్ప, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, విజయానందరెడ్డిని కమిటీలో నియమించింది. జిల్లాలో ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటారు.

News June 7, 2024

టంగుటూరు: 840 పొగాకు బేళ్లు కొనుగోలు

image

టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో ధర కేజీ రూ.261.29 పలికిందని వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. పొందూరు ప్లాస్టర్ గ్రామాలకు చెందిన రైతులు 900 పొగాకు బేళ్లు తీసుకురాగా 840పొగాకు బేళ్లు కొనుగోలు అయ్యాయని పేర్కొన్నారు. పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.332, కనిష్ఠ ధర రూ.205 పలికిందని చెప్పారు. ఈ వేలంలో మొత్తం 40 మంది వ్యాపారులు పాల్గొన్నట్లు వివరించారు.

News June 7, 2024

అన్నమాచార్య ఈఈఈ అధ్యాపకునికి డాక్టరేట్ ప్రధానం

image

రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న షేక్ ముక్తియార్ అలీకి అనంతపురం JNTU పీహెచ్‌డీ ప్రధానం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ తెలిపారు. ‘కాస్ట్ అలకేషన్ ఇన్ ఏడీ రెగ్యులేటరీ పవర్ సిస్టమ్ విత్ రిలైబులిటీ ఇండెక్స్’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ ప్రధానం జరిగిందని తెలిపారు.

News June 7, 2024

శతాబ్ది ఉత్సవాలకు గంధర్వ మహల్ ముస్తాబు

image

ఆచంటలోని గంధర్వ మహల్‎ నిర్మాణానికి అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు అయ్యిందని చెబుతుంటారు. నాటి సీఎంలు కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్‎టి రామారావు, నారా చంద్రబాబు నాయుడు ఆచంట వచ్చినప్పుడు ఈ మహల్‎లోనే బస చేసేవారు. గంధర్వ మహల్ ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ఈ మహల్‌ను నిర్మించిన గొడవర్తి నాగేశ్వరరావు మనవళ్లు శతాబ్ద ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. అందుకు మహల్ ముస్తాబవుతోంది.

News June 7, 2024

ఏపీఆర్‌డీ‌సీ డైరెక్టర్ పదవికి రాజీనామా

image

ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు నెల్లిమర్ల పట్టణానికి చెందిన నౌపడ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసరెడ్డికి పంపించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో డైరెక్టర్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

News June 7, 2024

బొమ్మనహల్ నీటి పంపకంపై ఇంజినీర్ల సమావేశం

image

తుంగభద్ర నీటి పంపకంపై ఆంధ్ర-కర్ణాటక ఇంజినీర్లు సమావేశాన్ని నిర్వహించారు. తుంగభద్ర జలాశయం పరిధిలో ఉన్న వివిధ కాలువలకు నీటి పంపకంపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా ఎస్సీఈ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో ఈసారి తుంగభద్ర జలాశయంకు 172 టీఎంసీలు వరద నీరు చేరుతుందని సమావేశంలో అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక ఇంజినీర్లు అధికారులు పాల్గొన్నారు.