India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన నెలవల విజయశ్రీ రికార్డు సృష్టించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. ఈ ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్యపై 29115 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును నెలవల విజయశ్రీ తిరగరాశారు. అయితే సూళ్లూరుపేటలో 1962 నుంచి 2024 వరకు ఎన్నికలు జరిగగా..1983లో మైలరీ లక్ష్మీకాంతమ్మ, 2009లో విన్నమాల సరస్వతి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడి పోయారు.

వైవీయు LLB 3, 5 సెమిస్టర్ల పరీక్షా ఫలితాలు వీసీ ఆచార్య చింత సుధాకర్, కుల సచివులు ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డితో కలిసి గురువారం ఫలితాలను విడుదల చేశారు. LLB ఐదేళ్ల కోర్సులో భాగంగా 3 సెమిస్టర్ పరీక్షలో 50 శాతం, 5 సెమిస్టర్లో 74.68 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. వైవీయు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచారని తెలిపారు.

గాజువాక నియోజకవర్గం పరిధిలో అగనంపూడి టోల్ ప్లాజాను నెలరోజుల్లో ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుతానన్నారు. గాజువాక ఖ్యాతి దేశానికి తెలిసేలా తనకు అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.

యూపీఎస్సీ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో యూపీఎస్సీ అధికారులు.. పరీక్షా కేంద్రాలున్న జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ డిల్లీరావు క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. విజయవాడలో పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి ప.గో జిల్లాలో ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ నడిచాయి. అయితే.. భీమవరానికి చెందిన ఓ మధ్యవర్తి కౌంటింగ్ తర్వాత కనిపించడం లేదని బెట్టింగ్రాయుళ్లు తలలు పట్టుకుంటున్నారు. తూ.గో, ప.గో, గుంటూరు, కృష్ణాకు చెందిన కొందరు సదరు మధ్యవర్తి సమక్షంలో దాదాపు రూ.33 కోట్ల బెట్సింగ్ పెట్టారు. మధ్యవర్తిత్వం వహించినందుకు ఆయనకు 5% కమీషన్ ఇస్తారు. కానీ.. ఆ వ్యక్తి ఆచూకీ లేకపోవడంతో వారంతా గొల్లుమంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చంద్రబాబు నివాసం వద్ద ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ బ్యానర్లకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తను ఎంపీగా చేసిన ఘనత లోకేశ్కే దక్కుతుందని అన్నారు. ఈ స్థాయికి తీసుకువచ్చిన చంద్రబాబు, లోకేశ్ను కలిసి అభినందనలు తెలిపేందుకు వచ్చానని ఆయన తెలిపారు.

కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజ్ల్లో ప్రవేశానికి జూన్ 10వ తేదీ తుది గడువని కడప ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం.జ్ఞాన కుమార్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న ఐటీఐల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు.

ఇచ్ఛాపురం, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. గడిచిన ఎన్నికల్లో అత్యధికంగా ఎచ్చెర్లలో నోటాకు ఓట్లు నమోదు కాగా, అత్యల్పంగా ఆమదాలవలసలో పడ్డాయి. ఈసారి అత్యధికంగా శ్రీకాకుళంలో 4,270 మంది, అత్యల్పంగా ఇచ్ఛాపురంలో 744 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఉన్నప్పటికీ వారి కంటే NOTAకే పడటం గమనార్హం.

రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజరాణి గెలుపొందారు. హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన తనూజరాణి ఎంబీబీఎస్ చేశారు. వైద్య వృత్తిలో డీఎంహెచ్వో, ఐసీడీఎస్ కార్యాలయాల్లో జిల్లా ఎపిడెమియాలజిస్టుగా పనిచేసేవారు. 2022లో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కుమారుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ను వివాహమాడారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల సహాయ, సహకారాలు, భాగస్వామ్యం మరువలేనిదని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ అన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. జిల్లాలో గెలుపొందిన పార్లమెంట్ అభ్యర్థి, 8 నియోజకవర్గాల శాసన సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.