India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నెల్లూరు ఎంపీగా ఘన విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారికి బాబు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో హుకుంపేట మండలానికి మహర్దశ పట్టనుందా అనేది భవిష్యత్తులో తేలనుంది. హుకుంపేట మండలానికి చెందిన ఇరువురు ఎంపీ, ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అరకు పార్లమెంట్ సభ్యురాలిగా అడ్డుమండ గ్రామానికి చెందిన గుమ్మ తనూజారాణి, అరకు ఎమ్మెల్యేగా కొంతిలి గ్రామానికి చెందిన రేగం మత్స్యలింగం విజయం సాధించారు. ఇద్దరూ వైసీపీ నుంచి విజయం సాధించడం కొస మెరుపు.

అదృష్టం ఉంటే తనకు మంత్రిత్వ శాఖ దక్కుతుందని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడం, జగన్ పాలనను ప్రజలు ఛీ కొట్టడంతో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని బూచిగా చూపించినప్పటికీ ముస్లింలు ఆలోచించి కూటమికి పట్టం కట్టారని కొనియాడారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్ను అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లి మండలం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఓడిన చోట పట్టుబట్టి అత్యధిక మెజారిటీతో గెలవడం గర్వించదగ్గ విషయమని అచ్చెన్నాయుడు కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండీసీ డైరెక్టర్ పదవికి కడప జిల్లాలోని వేంపల్లెకు చెందిన ఈఎస్ సల్మా బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ఏపీఎండీసీ ఛైర్మన్కు సమర్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పరాజయానికి చింతిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన టీడీపీ ఎంపీ అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన వారితో పలు అంశాలపై చర్చించారు. ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీ అభ్యర్థులకు తొలుత ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

కూటమికి కంచుకోటగా విశాఖ జిల్లా మారింది. 2014లో విశాఖ జిల్లాలో కూటమి తన సత్తా చూపింది. అనంతరం 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా సాగిన సమయంలో కూడా విశాఖలో 4 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచి తమ సత్తా చాటారు. తాజాగా విశాఖ జిల్లా మొత్తం కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజధానిగా విశాఖను జగన్మోహన్ రెడ్డి ప్రకటించినా.. ప్రజలు విశ్వసించకుండా కూటమికే జై కొట్టారు.

వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లికి చెందిన సైకం లక్ష్మమ్మ జగన్మోహన్ రెడ్డి ఓటమిని తట్టుకోలేక బుధవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆమె మృతికి సంతాపం తెలియజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు వైసీపీలో చురుగ్గా పాల్గొనే వారని తెలిపారు.

సాలూరు ఎమ్మెల్యేగా 13,733 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని గుమ్మడి సంధ్యారాణి.. వైసీపీ అభ్యర్థి రాజన్నదొరపై గెలుపొందారు. నియోజకర్గంలో మండలాల వారీగా ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ వివరాలు ఇలా ఉన్నాయి.
☛ సాలూరు రూరల్లో YCPకి 3,155
☛ సాలూరు టౌన్లో TDPకి 12,579
☛ పాచిపెంటలో YCPకి 104
☛ మెంటాడలో TDPకి 4,258
☛ మక్కువలో YCPకి 520
☛☛ పోస్టల్ బ్యాలెట్లో TDPకి 675 ఓట్ల మెజార్టీ వచ్చింది.

తాడిపత్రి అలర్ల కేసులో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ కోర్టులో హజరు కానున్నారు. ఇప్పటికే పెద్దారెడ్డి 9మంది అనుచరులు ఉదయం సరెండర్ అయ్యారు. వారికి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలు గుంతకల్లు కోర్టులో సరెండర్ కానున్నారు.
Sorry, no posts matched your criteria.