Andhra Pradesh

News April 15, 2024

చిత్తూరు: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంబళ్లపల్లి మండలంలో సోమవారం వెలుగుచూసింది. ఎస్సై శివ కుమార్ కథనం.. కురబలకోట మండలం, గొడ్డిన్లవారిపల్లికి చెందిన మంజునాథ్ తన భార్య సుజాతతో గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది, తంబళ్లపల్లి మండలం, కుక్కరాజుపల్లి సమీపంలోని కుమ్మరపల్లి వద్ద ఉన్న వ్యవసాయ పొలాల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 15, 2024

అత్యాచారయత్నం.. మర్మాంగం కోసేసిన మహిళ

image

అత్యాచారం చేయబోయిన ఓ వ్యక్తిపై తిరగబడిన మహిళ అతడి మర్మాంగం కోసేసింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరంలో ఆదివారం రాత్రి జరిగింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారం చేయబోయిన అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ
మర్మాంగాన్ని మహిళ బ్లేడుతో కోసింది. ఈ ఘటన జిల్లాలోనే సంచలనం రేపింది. సత్యనారాయణ అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News April 15, 2024

విజయవాడ: 20న కృష్ణా వర్శిటీ నెట్ బాల్ మహిళల టోర్నీ

image

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల నెట్ బాల్ మహిళల టోర్నమెంట్ 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి వి.లక్ష్మీ కనకదుర్గ తెలిపారు. ఈ టోర్నీలో కృష్ణా వర్శిటీ జట్టు ఎంపిక చేసే యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ ఆధ్వర్యంలో జరుగనున్న అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీకి పంపనున్నట్లు తెలిపారు. 20వ తేదీ ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్పారు.

News April 15, 2024

రాజంపేట: హాస్టల్‌లో ఉరి వేసుకుని విద్యార్థిని సూసైడ్

image

రాజంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన రేణుక కొత్త బోయనపల్లి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రేణుక సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తీసి చూడగా ఉరివేసుకుని చనిపోయినట్లుగా గుర్తించామని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 15, 2024

కర్లపాలెంలో 29 మంది వాలంటీర్లు రాజీనామా

image

కర్లపాలెం పంచాయతీలోని 29 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఎంపీడీవో నేతాజీకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామన్నారు. అలాంటి తమపై పలువురు కక్ష సాధింపునకు దిగడం బాధాకరమన్నారు. అందువల్లే రాజీనామా చేసినట్లు వారు తెలిపారు.

News April 15, 2024

17న శ్రీశైలంలో సీతారాముల కళ్యాణం

image

శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని శ్రీశైలం ఆలయంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 17వ తేదీన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. కళ్యాణోత్సవానికి ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించి గణపతి పూజ, గౌరీ పూజ, మాంగల్య పూజ, సీతారాముల కళ్యాణం ఉంటుందన్నారు.

News April 15, 2024

కాంగ్రెస్ పార్టీకి సీవీ శేషారెడ్డి రాజీనామా

image

పీసీసీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1959 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. అనుచరులతో సమావేశమై ఇకపై రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో ఉంటానన్నారు. సీవీ శేషారెడ్డి రెండు సార్లు సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు.

News April 15, 2024

గుంతకల్లు: 200 మంది వాలంటీర్ల రాజీనామా

image

గుంతకల్ పట్టణంలోని 4, 6, 18, 30వార్డులకు చెందిన, నెలగొండ, నాగసముద్రం, నక్కనదొడ్డి, N. కొట్టాల, N. వెంకటాంపల్లి గ్రామాలకు చెందిన 200మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గుంతకల్ మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలకు అందజేశారు. మళ్లీ సీఎంగా జగన్‌ను గెలిపించడానికి తాము రాజీనామా చేసినట్లు తెలిపారు.

News April 15, 2024

ప్రకాశం: రైలు కింద పడి గుర్తుతెలియని మహిళ మృతి

image

ఉలవపాడు మండలం తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ట్రాక్ సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆకుపచ్చ రంగు చీర ధరించినట్లు తెలిపారు.

News April 15, 2024

వైసీపీకి రాజీనామా చేసిన దువ్వాడ దంపతులు

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్, ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ సోమవారం పలాసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 11 సంవత్సరాలుగా పార్టీకి విధేయుడుగా సేవలందించినా గడిచిన కొంతకాలంగా జరిగిన అవమానాలను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.