India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ఓట్లలెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తూ.. వారి విధులు సక్రమంగా నిర్వహించారన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

నెల్లిమర్ల నియోజకవర్గం 2007-08 పునర్వ్యవస్థీకరణలో ఏర్పడింది. 2009,19లలో బడ్డుకొండ అప్పలనాయుడు, 2014లో పతివాడ నారాయణస్వామి గెలిచారు. దీంతో నెల్లిమర్ల నుంచి మూడు సార్లు పురుషులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2024లో జనసేన అభ్యర్థి మాధవి 39వేల పైచిలుకు మెజార్టీతో గెలిచి నెల్లిమర్ల మొదటి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

డోన్లో టీడీపీ నేత కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ను 6 వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడైన జయసూర్యప్రకాశ్ రెడ్డి గతంలో మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగానూ ఆయన పనిచేశారు. ఈ సీనియర్ లీడర్ తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, సిబ్బందికి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్య పరిచామని పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక చర్యలకు, గొడవలకు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.

నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు. గెలిచిన పది మందిలో ఇద్దరు మహిళలు కాగా.. తొలిసారి వీరు అధ్యక్షా.. అననుండడం విశేషం.

పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు వ్యూహాలను ప్రయోగించారని, అవేమీ పనిచేయలేదని కూటమి శ్రేణులు, జనసైనికులు అంటున్నారు. పిఠాపురంలోనే జగన్ ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చినా, హామీలు కుమ్మరించినా, వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తానన్నా.. వాటి ప్రభావం ఫలితాల్లో ఎక్కడా కనిపించలేదన్నారు.

నీట్ యూజీ (ఎంబీబీఎస్) 2024 ఫలితాలలో రామాపురం మండలంలోని నల్లగుట్టపల్లి గ్రామం కస్పాకు చెందిన బండపల్లి మేఘన, బండపల్లి మధుసూదన్ రెడ్డిల కుమార్తె బండపల్లి నేహా రెడ్డి మెరిశారు. నేహా రెడ్డి 670 మార్కులు సాధించి ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటాలో 1651వ ర్యాంక్ సాధించారు. కృషి, పట్టుదలతో విజయవాడలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని 670 మార్కులు సాధించినట్లు తల్లిదండ్రులు చెప్పారు.

➤ సీనియర్లు: గోరంట్ల (7వసారి), వేగుళ్ల (5వసారి), బండారు (4వసారి), జ్యోతుల నెహ్రూ (3వసారి), చినరాజప్ప (3వసారి), నల్లమిల్లి (2వసారి), ఆనందరావు (2వసారి), కొండబాబు (2వసారి), దాట్ల సుబ్బరాజు (2వసారి), ముప్పిడి వెంకటేశ్వరరావు (2వసారి).
➤ తొలిసారి: పవన్, దివ్య, సత్యప్రభ, శిరీషాదేవి, గిడ్డి సత్యనారాయణ, నానాజీ, దేవవరప్రసాద్, ఆదిరెడ్డి శ్రీనివాస్, బలరామకృష్ణ , వాసంశెట్టి, దుర్గేశ్, మద్దపాటి వెంకటరాజు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున పోటీ చేసిన మంత్రుల పైనే కూటమి అభ్యర్థులు ఎక్కువ మెజారిటీ సాధించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ చేతిలో 59,915 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు సెంట్రల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా 68,886 ఓట్ల తేడాతో ఉమ చేతిలో ఓడిపోయారు. కాగా ఉమ్మడి కృష్ణాలో ఈ మెజార్టీలే అత్యధికం.
Sorry, no posts matched your criteria.