Andhra Pradesh

News June 5, 2024

అవినాష్ రెడ్డికి డిక్లరేషన్ అందజేత

image

కడప ఎంపీగా ఎన్నికైన వైయస్ అవినాష్ రెడ్డికి ఎన్నికల అధికారులు డిక్లరేషన్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి షర్మిల, కూటమి అభ్యర్థి భూమేష్ రెడ్డి మీద భారీ మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలుపొందారు. వరుసగా మూడోసారి వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు అవినాష్ రెడ్డికి డిక్లరేషన్ పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 5, 2024

విశాఖలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు వీరే 

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. భీమిలిలో గెలిచిన గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమలో పీవీజీఆర్ నాయుడు (గణబాబు) విజయం సాధించారు.

News June 5, 2024

అనంతపురం ఎంపీగా అంబికా విజయం.. ధ్రువీకరణ పత్రం అందజేత

image

అనంతపురం ఎంపీగా టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. ఆయనకు 7,51,109 ఓట్లు, వైసీపీ అభ్యర్థి శంకర నారాయణకు 5,69,766 వచ్చాయి. వైసీపీ అభ్యర్థిపై 1,81,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో విజయం సాధించిన అంబికాకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్ కుమార్ డిక్లరేషన్ పత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

News June 5, 2024

ఒంగోలు ఎంపీగా మాగుంట గెలుపు

image

ఒంగోలు ఎంపీగా టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 48వేలకు పైగా ఓట్లతో ఘనవిజయం సాధించారు.

News June 5, 2024

మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న గౌతు శిరీష

image

పలాస నియోజకవర్గ పరిధి 22వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుకు 61,210 ఓట్లు, ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీషకు 1,01,560 ఓట్లు పోలయ్యాయి. కాగ ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీష 40,350 ఓట్లు ఆధిక్యతతో విజయం సాధించారు. ఈమె మొదటి ప్రయత్నంలో ఓడినప్పటికీ రెండవ ప్రయత్నంలో విజయం సాధించి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

News June 5, 2024

సత్యవేడు: డిక్లరేషన్ అందుకున్న ఆదిమూలం

image

సత్యవేడు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి ఆదిమూలం సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప వైఎస్ఆర్సిపి అభ్యర్థిపై 2,650 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఫామ్ అందజేశారు. ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన టిడిపిలో చేరారు.

News June 5, 2024

తుగ్గలి నాగేంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి: శంకర్

image

తుగ్గలి నాగేంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని లక్ష్మికుమ్మరి శాలివాహన కోఆపరేటరేటివ్ సొసైటీ ట్రెజరర్ కుమ్మరి శంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో కుమ్మరి శాలివాహన సంఘాన్ని గుర్తించి ఐలాపురం వెంకయ్యకు ఎమ్మెల్సీ ఇచ్చారని, 2019లో వైఎస్ జగన్ శాలివాహన సంఘాన్ని గుర్తించి ఎం.పురుషోత్తంకు ఫెడరేషన్ ఛైర్మన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు నాగేంద్రకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నారు.

News June 5, 2024

ప్రజాతీర్పును శిరసా వహిస్తాం: తానేటి వనిత

image

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి తానేటి వనిత మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ణతలు అని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అన్నారు.

News June 5, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో గెలుపు గుర్రాలు వీరే..

image

⁍సాలూరు: గుమ్మడి సంధ్యారాణి (TDP)
⁍బొబ్బిలి: బేబినాయన (TDP)
⁍పార్వతీపురం: బోనెల విజయచంద్ర (TDP)
⁍కురుపాం: తోయక జగదీశ్వరి (TDP)
⁍చీపురుపల్లి: కళా వెంకట్రావు (TDP)
⁍గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్ (TDP)
⁍ఎస్.కోట: కోళ్ల లలిత కుమారి (TDP)
⁍విజయనగరం: అదితి గజపతిరాజు (TDP)
⁍నెల్లిమర్ల: లోకం మాధవి (JSP)

News June 5, 2024

ఎమ్మెల్యేగా ఆదాలకు తొలి ఓటమి .

image

శాసనసభ ఎన్నికల బరిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. 1999 ఎన్నికల్లో అల్లూరు ఎమ్మెల్యేగా, 2004, 2009 ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదాల 2019లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇదే ఆయనకు తొలి ఓటమి.