India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో పేదరికంలో పుట్టి, బాల్య వివాహంను ఎదిరించి అధికారుల సహకారంతో ఇంటర్ టాపర్గా నిలిచిన నిర్మలను ఆదివారం జిల్లా కలెక్టర్ సృజన అభినందించారు. కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఆస్పరి మండలం కేజీబీవీ కళాశాల విద్యార్థిని నిర్మల తన కుటుంబ సభ్యులతో కలెక్టర్ను కలిశారు. ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల్లో నిర్మల టాపర్గా నిలవడం అభినందనీయమన్నారు.
కదిరి నియోజక వర్గానికి చెందిన పవన్ కుమార్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినందుకు చంద్రబాబు, లోకేశ్, నియోజక వర్గం అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 22న పెదకూరపాడులో నామినేషన్ వేయనున్నట్లు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు. అచ్చంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆ మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం జగన్ ఐదేళ్లలో చేసిన సుపరిపాలన మరో ఐదేళ్లు కొనసాగించాలంటే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతు తెలపాలని కోరారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్.బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చోటుదక్కింది. 3600 ప్రాజెక్టులను వీడియోల ద్వారా తల్లిదండ్రులకు వివరించడం, 500 అంబేడ్కర్ చిత్రపటాలు గీయడం వంటి వేర్వేరు విభాగాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ ఘనత సాధించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ రాజారావు ఆదివారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
నేడు డయల్ యువర్ సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను 0891-2523408 నంబర్కు డయల్ చేసి తెలియపరచాలని సూచించారు. అనంతరం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు వృద్ధుల సమస్యలు, ఫిర్యాదుల కోసం సమయం కేటాయించడం జరిగిందని చెప్పారు.
భారతరత్న డా. బీ. ఆర్. అంబేడ్కర్ జయంతి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారిత శాఖ ఆధ్వర్యంలో జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక జ్యోతి భారతరత్న అంబేడ్కర్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శోబిక అన్నారు.
ఈ నెల 19వ తేదీన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరిగే మేమంతా సిద్ధం సభను జయప్రదం చేయాలని కె.గంగవరం మండల కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్ పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపట్టిన సిద్ధం బస్సు యాత్రకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక పార్టీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
పీలేరులో షర్మిల నిర్వహించనున్న న్యాయ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 16వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటలకు పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో రోడ్ షో ఉంటుదని తెలిపారు. కార్యక్రమంలో అమృతతేజ, దుబ్బా శ్రీకాంత్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
సీఎం జగన్పై దాడి ఘటనలో దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో హింసకు తావులేదన్నారు. జగన్పై దాడి ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని అన్నారు. అనంతరం దోషులను వెంటనే పట్టుకోవాలని డీజీపీని కోరినట్లు చెప్పారు.
పెందుర్తి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తున్నానని ప్రజలు మరోసారి అవకాశం కల్పించాలని వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ విజ్ఞప్తి చేశారు. పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు. భర్నికం పంచాయతీ అభివృద్ధికి రూ.1.94 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే రూ.10.76 విలువ గల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు.
Sorry, no posts matched your criteria.