India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగే టీడీపీ-జనసేన-బీజేపీ బహిరంగ సభకు ‘ప్రజాగళం’గా నామకరణం చేశారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఎస్పీజీ నిఘాలో సభా వేదిక, హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతోంది. మోదీ, చంద్రబాబు, పవన్లు ప్రత్యేక హెలికాప్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఎండాకాలం కావడంతో సభా సమయంలో అత్యవసర వైద్య సేవల కోసం చిలకలూరిపేటలో ఓ ఆస్పత్రిని సిద్ధం చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలుగురు వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు నుంచి మేరిగ మురళీధర్, నెల్లూరు నగరం నుంచి ఖలీల్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. ఆదాల, రామిరెడ్డి నాలుగో సారి, కిలివేటి, కాకాణి మూడో సారి, మేకపాటి విక్రమ్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 MLA స్థానాలు, 2 MP స్థానాలు ఉన్నాయి. వీటిలో YCP అధిష్ఠానం ఇద్దరు మహిళా నేతలకు MLA స్థానాలను కేటాయించింది. పత్తికొండ MLA అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని, ఎమ్మిగనూరు MLA అభ్యర్థిగా బుట్టా రేణుకను ప్రకటించింది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను.. ఇద్దరు మహిళా నేతలను YCP పోటీలో నిలిపింది.
కావలి మాజీ శాసనసభ్యుడు వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా వేసి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
గంట్యాడ మండలంలోని వసాది గ్రామ సమీపంలో కొత్త వెలగాడ రహదారి జంక్షన్లో రహదారిపై, శనివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.కోట మం. కొత్తూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు ఒక బైక్పై, వేరొక బైక్పై జామి మం. తానవరానికి చెందిన ముగ్గురు యువకులు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొత్తూరు వాసి మృతిచెందగా, అతని భర్యతో పాటు తానవరానికి చెందిన ముగ్గురు యువకులు గాయపడ్డారు.
రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి,జి.రామకృష్ణ, ఎస్ లక్ష్మినారాయణరెడ్డి, ఆర్ఐ రాముడు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప ఎంపీగా గెలిచారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారు. 2014 పులివెందుల ఎమ్మెల్యేగా 75,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో, 2019లో 90,110 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా జగన్ చరిత్ర సృష్టించారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికల బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో ఉన్నారు. మంగళగిరి నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ (టీడీపీ) బరిలో ఉండగా.. తెనాలి నుంచి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ (జనసేన)లో పోటీ చేస్తున్నారు. అలాగే గురజాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న కాసు మహేష్ రెడ్డి తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
వెంకటగిరి బరిలో నిలుస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ నేతల వారసులే. ఇద్దరికి ఇవే మొదటి ప్రత్యక్ష ఎన్నికలు. వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మిల కుమారుడు. టీడీపీ అభ్యర్థి లక్ష్మీ సాయిప్రియ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కుమార్తె. జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి, రామకృష్ణ ముగ్గురూ వెంకటగిరి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. మరి వారసుల్లో పైచేయి ఎవరిదో.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే.. ఓసీ సామాజిక వర్గం నుంచి 9 మంది, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎన్నికలో బరిలో నిలుస్తున్నారు.
Sorry, no posts matched your criteria.