India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ ఛైర్స్ పర్సన్ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు డాక్టర్ అవనాపు భావన ప్రకటించారు. అదేవిధంగా వైసీపీ యూత్ వింగ్ ఇంఛార్జ్ విక్రమ్ పార్టీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి వైసీపీ నుంచి మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్పై 94,058 ఓట్ల భారీ మెజారిటీని సాధించారు. 22 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి పల్లా శ్రీనివాసరావు తన ఆధిక్యతను కొనసాగించారు. చివరి రెండు రౌండ్లు ముగిసే సమయానికి పల్లా శ్రీనివాస్కు 1,55,587 ఓట్లు లభించాయి.

రేపు బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, గుంటూరు జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.

ఈనెల 6 తేదీన పలాస-విశాఖపట్నం మధ్య నడిచే పాసింజర్ రైలు, విశాఖ- పలాస మధ్య నడిచే పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం- గుణుపూర్ మధ్య నడిచే పాసింజర్ రైలు, గుణుపూర్-విశాఖకు నడిచే పాసింజర్ రైలు రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

మద్దికేర మండల పరిధిలోని ఎం.అగ్రహారంలో చిన్న బసప్ప కుమారుడు రంజిత్ క్రికెట్ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో విద్యార్థి వీరేశ్ స్వల్పంగా గాయపడటంతో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మృతి చెందిన రంజిత్ ఇటీవల పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించాడు. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

రాయచోటి నియోజకవర్గ ఫలితం తేలింది. చివరి రౌండ్ వరకు దోబూచులాడి ఆఖరి రౌండ్లో మండిపల్లికి విజయాన్ని అందించింది. గడికోటపై మండిపల్లి 1000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. అంతేకాకుండా ఇది ఉమ్మడి జిల్లాలో చివరి ఫలితం. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7, వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి.

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అధితి విజయలక్ష్మి గజపతిరాజు ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామ పై 57,729 ఓట్ల మెజార్టీ సాధించారు. అతిధి విజయలక్ష్మికి అన్ని రౌండ్లు కలిపి 1,16,393 పోల్ అయ్యాయి. వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామికి అన్ని రౌండ్లు కలిపి 58,664 ఓట్లు పోలయ్యాయి. కాగా ఈ విజయంతో ఉమ్మడి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.

ఆదోని ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వై.సాయిప్రసాద్ రెడ్డి పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారధి వాల్మీకి చేతిలో 18,563 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పార్థసారథి గెలుపుతో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

పిఠాపురం-పవన్, అనపర్తి-నల్లమిల్లి, రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి, రాజమండ్రి రూరల్-గోరంట్ల, రాజానగరం-బత్తుల, ప్రత్తిపాడు-సత్యప్రభ, పెద్దాపురం-చినరాజప్ప, తుని-దివ్య, రాజోలు-దేవవరప్రసాద్, జగ్గంపేట-జ్యోతుల, రంపచోడవరం-శిరీషాదేవి, కాకినాడ సిటీ-కొండబాబు, కొత్తపేట-బండారు, కాకినాడ రూరల్-నానాజీ, అమలాపురం-ఆనందబాబు, పి.గన్నవరం-గిడ్డి, మండపేట-వేగుళ్ల, ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు, రామచంద్రపురం-వాసంశెట్టి సుభాశ్.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 స్థానాల్లో ఫలితాలు తేలాయి. ఇక మిగిలింది దర్శి, అద్దంకి స్థానాలే. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ 22 వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి అయిన హనిమిరెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది.
Sorry, no posts matched your criteria.