Andhra Pradesh

News June 4, 2024

శింగనమలలో బండారు శ్రావణిశ్రీ గెలుపు

image

శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించారు. టీడీపీ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తూ ముందంజలో దూసుకెళ్లింది. వైసీపీ అభ్యర్థిపై వీరాంజనేయులపై 21 రౌండ్లు పూర్తయ్యేసరికి 8,159 ఓట్ల తేడాతో గెలుపొందారు. బండారు శ్రావణిశ్రీ 101223 ఓట్లు, వీరాంజనేయులుకు 93064 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపాల్సి ఉంది.

News June 4, 2024

కర్నూలులో టీజీ భరత్ ఘన విజయం

image

కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఘన విషయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్‌పై 19,200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వీటికి ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలపాల్సి ఉండటంతో మెజారిటీ పెరగనుంది. భరత్‌కు 79,183, ఇంతియాజ్‌కు 58,449 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 4, 2024

పర్చూరులో టీడీపీ జెండా

image

ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. సమీప ప్రత్యర్థి యడం బాలాజీపై 22,221 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు టీడీపీ నాలుగు స్థానాల (సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు)ను సొంతం చేసుకుంది.

News June 4, 2024

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల ఘోర ఓటమి

image

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి మంత్రి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ పై, నరసన్నపేట వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్, టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై ఓడిపోయారు. అలాగే పలాస వైసీపీ అభ్యర్థి మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై వెనుకంజులో ఉన్నారు.

News June 4, 2024

పుంగనూరులో ఆగిన ఫలితం..!

image

పుంగనూరు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 18 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 94,876 ఓట్లు సాధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,538 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. చివరి రౌండ్ ఫలితం వచ్చి దాదాపు 2 గంటలవుతున్నా.. తర్వాత అధికారులు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదట. అక్కడ ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

News June 4, 2024

25 ఓట్ల తేడాతో మడకశిరలో గెలుపు

image

మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి ఈర లకప్పపై 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78347ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఈర లకప్పకు 78322ఓట్లు వచ్చాయి. వైసీపీ నేతలు రీకౌంటింగ్ అడగగా ఎన్నికల అధికారులు నిరాకరించినట్లు సమాచారం. ఇంకా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కలపాల్సి ఉంది.

News June 4, 2024

గిద్దలూరును కైవసం చేసుకున్న టీడీపీ

image

ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిపై 2వేలకు పైగా ఓట్లతో గెలిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ మూడు స్థానాల (సంతనూతలపాడు, మార్కాపురం)ను సొంతం చేసుకుంది.

News June 4, 2024

3,16,231 ఓట్ల ఆధిక్యంలో పెమ్మసాని

image

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఆయన 3,16,231 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 7,64,321 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 4,48,090 ఓట్లు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌కు 4,026 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధిక్యం

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 15 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 5,22,204 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 2,99,715 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 2,22,489 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. అలాగే జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తుంది.

News June 4, 2024

నాలుగు లక్షలు దాటిన శ్రీభరత్ మెజార్టీ

image

విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ 4 లక్షల మెజారిటీ దాటింది. ఇప్పటివరకు భరత్‌కు 7,28,914 ఓట్లు లభించాయి. బొత్స ఝాన్సీకి 3,23,932 ఓట్లు లభించాయి. దీంతో శ్రీభరత్ 4,04,982 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరొక పది ఓట్లు కలిస్తే భరత్ నాలుగు లక్షల మార్కును చేరుకుంటారు. విశాఖ లోక్‌సభ స్థానంలో సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నారు.