Andhra Pradesh

News April 14, 2024

చిత్తూరు:14 నుంచి రీకౌంటింగ్ కు దరఖాస్తు

image

ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని DVEO.సయ్యద్ మౌలా శనివారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 24 వరకు సబ్జెక్టుల వారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 24 నుంచి జూన్ ఒకటి వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీవీఈవో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు.

News April 14, 2024

విజయనగరం: పాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా రద్దయిన ఈ రైళ్లను విశాఖ-రాయగడ-విశాఖ మధ్య నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు విశాఖ-రాయగడ మధ్య ఈనెల 16 నుంచి 25 వరకు రాయగడ- విశాఖ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.

News April 14, 2024

ఈనెల 24వ తేదీ వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ఈ నెల 18 నుంచి 24వ తేదీలోపు చెల్లించాలని డీఐఈఓ రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రథమ ఇంటర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు 24వ తేదీలోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

News April 14, 2024

జగన్‌పై దాడి.. ప్రకాశం జిల్లా నేతలు ఏమన్నారంటే?

image

సీఎం జగన్‌పై విజయవాడ బస్సు యాత్రలో దాడి జరిగిన విషయం తెలిసింది. దీనిపై ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు స్పందించారు. జగన్‌పై దాడి టీడీపీ మూకల పనేనని జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివ ప్రసాద్ అన్నారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆధరణను చూసి ఓర్వలేక దాడి చేశారని జంకె వెంకటరెడ్డి, కేపీ నాగార్జునరెడ్డి, దద్దాల అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచి పరిణామాలు కాదని అన్నా రాంబాబు హితవు పలికారు.

News April 14, 2024

అనకాపల్లి జిల్లాలో 12,79,685 మంది ఓటర్లు

image

ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావడానికి ఆదివారంతో గడువు ముగియనుంది. జిల్లా పరిధిలోని పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో కలిపి ప్రస్తుతం 12,79,685 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం తమ వివరాలను ఓటర్ల హెల్ప్ లైన్ యాప్, సీఈఓ ఆంధ్ర వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని డీఆర్ఓ దయానిధి సూచించారు.

News April 14, 2024

నెల్లూరు: 61 మందికి 9 మందే పాస్

image

పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఈ ఏడాది 61 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాశారు. వారిలో కేవలం 9 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 56 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 28 మంది పాస్ అయ్యారు. కళాశాలలో అన్నీ వసతులున్నా చాలా తక్కువ మంది ఉత్తీర్ణులు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News April 14, 2024

పెద్దముడియం: భార్య గొంతు కోసి హత్యచేసిన భర్త

image

పెద్దముడియం మండలంలోని దిగువ కల్వటాల గ్రామంలో భార్యను ఆమె భర్త గొంతు కోసి హత్య చేశాడు. దిగువ కల్వటాలకు చెందిన ఆదిలక్ష్మికి మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన మేనమామ సహదేవుడితో 15 ఏళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదిలక్ష్మి 2 నెలలుగా పుట్టింటి వద్ద ఉంటోంది. భార్య సంసారానికి రాలేదన్న కోపంతో శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న ఆదిలక్ష్మిని భర్త కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

News April 14, 2024

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

image

వెల్దుర్తి మండల కేంద్రంలోని సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన చంద్రనారాయణ (జేఎల్ఎమ్), డోన్‌లో నివాసముంటున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ స్రవంతి శుక్రవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. శనివారం స్రవంతి తమ్ముడు, తల్లి, మరికొందరు వెల్దుర్తికి వచ్చి చంద్రనారాయణ ఇంటి వద్ద గొడవ చేశారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని ఆ జంట కర్నూలు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది.

News April 14, 2024

విశాఖ: పాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా రద్దయిన ఈ రైళ్లను విశాఖ-రాయగడ-విశాఖ మధ్య నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు విశాఖ-రాయగడ మధ్య ఈనెల 16 నుంచి 25 వరకు రాయగడ- విశాఖ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.

News April 14, 2024

విశాఖ: రైల్వే స్టేషన్లలో తాగునీరు

image

రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని రైల్వే స్టేషన్లలో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్ ఫామ్స్ పై తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, స్కౌట్ గైడ్స్, స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో సాధారణ బోగీలు వద్ద చల్లని తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.