Andhra Pradesh

News June 4, 2024

రాయచోటి: అనూహ్యంగా టీడీపీకి లీడింగ్

image

రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి అనూహ్య లీడింగ్ వచ్చింది. 19రౌండ్ వరకు లీడ్ ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, 20వ రౌండ్‌లో 871 ఓట్లతో వెనుకపడ్డారు. ఇక చివరిగా ఒక్క రౌండ్ ఉంది. తుది విజేత ఎవరో కాసేపట్లో తేలనుంది.

News June 4, 2024

ప.గో.: క్లీన్ స్వీప్.. చరిత్ర సృష్టించిన కూటమి

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు చరిత్ర సృష్టించారు. ఉమ్మడి జిల్లాలోని 15 స్థానాల్లో అన్నిచోట్ల విజయ దుందుభి మోగించారు. జనసేన 6 చోట్ల (నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉంగుటూరు, నరసాపురం, పోలవరం) టీడీపీ 9 చోట్ల పోటీచేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 2 చోట్ల గెలుపొందింది.
– SHARE IT

News June 4, 2024

చారిత్రక విజయం దిశగా శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చారిత్రక విజయాన్ని అందుకునే దిశగా టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ కదులుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో శ్రీభరత్ 6,76,463 ఓట్లు సాధించారు. దీంతో ఆయన ఆధిక్యత 3,74,090 ఓట్లకు చేరింది. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికీ కేవలం 3,02,373 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 23 వేల ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

1,10,000 ఓట్ల మెజార్టీతో బీకే పార్థసారథి

image

హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి లక్ష పదివేల ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉందని ఏది ఏమైనా గెలుపు ఖాయం అని పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. 1, 50, 000 ఓట్లతో గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నారు.

News June 4, 2024

అనంతగిరి అంగన్‌వాడీ TO అసెంబ్లీ

image

రంపచోడవరంలో వైసీపీ కంచుకోటను టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవి బద్ధలు కొట్టారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ఇక్కడ TDP జెండా ఎగిరింది. వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మొత్తం 80,948 ఓట్లు రాగా.. శిరీషకు 90,087 ఓట్లు పోలయ్యాయి. 9,139 ఓట్ల మెజార్టీతో ధనలక్ష్మిపై శిరీష విజయ సాధించారు. అనంతగిరి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసిన శిరీష.. ఇప్పుడు MLAగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నడటం విశేషం.

News June 4, 2024

ప్రకాశం జిల్లాలో మరో టీడీపీ నేత గెలుపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సైకిల్ జోరు చూపిస్తోంది. మార్కాపురం నుంచి టీడీపీ నేత కందుల నారాయణరెడ్డి గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి అన్నా రాంబాబుపై 16746 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఇప్పటివరకు అధికారికంగా రెండు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కాగా సంతనూతలపాడులో బి.ఎన్.విజయ్ గెలిచిన విషయం తెలిసిందే.

News June 4, 2024

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్..?

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుంది. ఇప్పటికే గొండు శంకర్ (శ్రీకాకుళం), కూన రవికుమార్ (ఆమదాలవలస), బెందాళం అశోక్ (ఇచ్చాపురం) భారీ మెజారిటీతో గెలుపొందారు. గౌతు శిరీష (పలాస), కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), మామిడి గోవిందరావు (పాతపట్నం), కొండ్రు మురళి (రాజాం), ఈశ్వరరావు (ఎచ్చెర్ల), జయకృష్ణ (పాలకొండ) విజయం దిశగా పయనిస్తున్నారు.

News June 4, 2024

25 ఓట్ల తేడాతో మడకశిరలో గెలుపు

image

మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన కౌంటింగ్ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి ఈర లకప్పపై 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78347ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఈర లకప్పకు 78322ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

వీ.వీ లక్ష్మీనారాయణ కంటే ఇండిపెండెంట్‌ ముందంజ

image

విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లలో ఇప్పటికే 19 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు 44,975 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు 57,392 ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వి.శిరీష, 4వ స్థానంలో జేడీ లక్ష్మీనారాయణ, ఐదో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామారావు ఉన్నారు.

News June 4, 2024

ప.గో.: 13 చోట్ల కూటమి ఘన విజయం.. ఇంకా రెండే

image

నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కందుల దుర్గేశ్ విజయం సాధించారు. మొత్తం 102699 ఓట్లు సాధించగా.. 33304 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ప్రత్యర్థి జి.శ్రీనివాస నాయుడుకు 69395 ఓట్లు వచ్చాయి. ఇక ఈ విజయంతో ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో 13 కైవసం చేసుకున్నట్లయింది. ఇంకా పోలవరం, దెందులూరు ఫలితాలు రావాలి.