Andhra Pradesh

News March 12, 2025

కడప: యూత్ పార్లమెంట్ పోస్టర్లు ఆవిష్కరించిన JC

image

జాతీయ యూత్ పార్లమెంట్ ఉపన్యాసాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువత ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఉపన్యాసాల ద్వారా యువతలోని ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి మణికంఠ పాల్గొన్నారు.

News March 12, 2025

ఒంగోలు: ‘భూముల పున పరిశీలన పటిష్టంగా చేపట్టాలి’

image

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన పటిష్టంగా చేపట్టాలని సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ.. నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తిస్థాయిలో పరిశీలన జరగాలన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.

News March 12, 2025

పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు దిశగా చర్యలు: కలెక్టర్ 

image

పేదలందరికీ ఇళ్ళు ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ప.గో జిల్లాలో 18,340 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బీసీలులు 12,362, ఎస్సీలు 5,593, ఎస్టీలు 385 లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటికి అదనంగా రూ.92.66 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

News March 12, 2025

జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు ప్రయోజనం: క‌లెక్ట‌ర్‌

image

జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు రూ.1199.85 కోట్లు నిధులు మంజూరు చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్ తెలిపారు. 2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌ట‌క‌న‌లో తెలిపారు.

News March 12, 2025

ఎంపీ ల్యాడ్స్ పనులు పూర్తి చేయాలి

image

ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మంగళవారం ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టిన పనుల పురోగతిపై ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 48 పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

News March 12, 2025

విశాఖ నుంచి పట్నాకు ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి పట్నాకు స్పెషల్ (08537/38) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16, 23, 30 తేదీలలో బయలుదేరి మరుసటి రోజు పట్నాకు చేరుతాయి. మళ్లీ మార్చి 17, 24, 31 తేదీలలో పాట్నా నుంచి బయలుదేరి విశాఖ చేరుతాయని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News March 12, 2025

శ్రీకాకుళం: 3 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ

image

శ్రీకాకుళం జిల్లాలో రేపు బుధవారం 3 మండలాల్లో కింద పేర్కొన్న విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. వృద్ధులు, ఆరుబయట పనిచేసే కార్మికులు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక X ఖాతా ద్వారా రెడ్ అలర్ట్ జారీ చేసింది. *బూర్జ 39.9* హిరమండలం 40.2 *ఎల్.ఎన్.పేట 40.2

News March 12, 2025

ఫ్రీ హోల్డ్ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల PGRS అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని, రెండో విడత రీ సర్వేకు సంబంధించి మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే పనులు ప్రారంభించాలన్నారు. ఫీడ్ బ్యాక్ తదితర అంశాలపై కలెక్టర్‌తో సీసీఎల్ఏ & స్పెషల్ సీఎస్ జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు.

News March 12, 2025

VZM: ఉల్లాస్ కార్యక్రమం.. 3 గంటల పాటు పరీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు 3 గంటల పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బీఆర్‌ అంబేడ్కర్ తెలిపారు. ఈ పరీక్ష 23న ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుందని, ఈ మధ్యలో ఏ 3 గంటలైనా అభ్యర్థులు పరీక్షను రాయవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సుమారు 48 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారని, 875 పాఠశాలలను గుర్తించి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News March 12, 2025

కడప జిల్లాను పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

image

కడప జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని, వాటి విలువలు అందరికీ తెలిపే విధంగా ప్రసిద్ధ ప్రదేశాలు, ఆలయాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం ఇంటాక్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న పురాతన కట్టడాలు, ప్రసిద్ధ ఆలయాలు, బౌద్ధ జైన వారసత్వ ప్రదేశాలు, కళలు, సంప్రదాయాలు తెలియజెప్పేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.