Andhra Pradesh

News June 4, 2024

ప.గో.: 13 చోట్ల కూటమి ఘన విజయం.. ఇంకా రెండే

image

నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కందుల దుర్గేశ్ విజయం సాధించారు. మొత్తం 102699 ఓట్లు సాధించగా.. 33304 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ప్రత్యర్థి జి.శ్రీనివాస నాయుడుకు 69395 ఓట్లు వచ్చాయి. ఇక ఈ విజయంతో ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో 13 కైవసం చేసుకున్నట్లయింది. ఇంకా పోలవరం, దెందులూరు ఫలితాలు రావాలి.

News June 4, 2024

కర్నూలు: నాలుగో సారి ఎమ్మెల్యేగా ఘన విజయం

image

మంత్రాలయం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై 12,843 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాగా వరుసగా 2009లో టీడీపీ నుంచి, 2014, 2019, 2024లో వైసీపీ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు.

News June 4, 2024

దాసరి సుధ గెలుపు

image

బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ గెలిచారు. ఆమెకు 90,410 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్నకు 81,843 ఓట్లు పడ్డాయి. దీంతో 8,567 మెజార్టీ ఓట్లతో గెలిచారు. దీంతో ఆమె రెండో సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

News June 4, 2024

రెండు చోట్ల వైసీపీ.. ఓ చోట టీడీపీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు 1,63, 508 ఓట్ల ఆధిక్యంలో విజయం వైపు దూసుకెళ్తున్నారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుప్రసాద్ 27,520 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు రాజంపేట వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి 59,127 ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్నారు.

News June 4, 2024

ఆమదాలవలసలో స్పీకర్ ఓటమి

image

ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి కూన కుమార్‌, వైపీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంపై వేల పైచిలుకు 33,285 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరుగుతోంది.

News June 4, 2024

15వ రౌండ్: చీపురుపల్లిలో టీడీపీ హవా

image

చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి 19 రౌండ్లు ఉండగా 15 రౌండ్‌ల లెక్క ముగిసింది. ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావుకు 70,000 ఓట్లు రాగా.. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణకి 60,084 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 9,916 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

మూడు లక్షలు దాటిన శ్రీభరత్ ఆధిక్యత

image

విశాఖపట్నం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీ భరత్ భారీ ఆధిక్యతతో దూసుకు వెళుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు 5,60,792 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన బొత్స ఝాన్సీలక్ష్మికి 2,54,739 ఓట్లు లభించాయి. దీనితో శ్రీభరత్ 3,60,53 ఓట్ల భారీ మెజారిటీతో ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్యా రెడ్డికి 18956 ఓట్లు లభించి 3వ స్థానంలో ఉన్నారు.

News June 4, 2024

ఖాతా తెరవని YCP.. 9చోట్ల కూటమిదే గెలుపు

image

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ఖాతా తెరిచే అవకాశం కనిపించడం లేదు. ఒక్కొక్కటిగా జిల్లా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేస్తూ వస్తోంది. మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఇప్పటికే  9 స్థానాల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. మిగిలిన 10 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొద్దిసేపట్లో వాటిపైనా క్లారిటీ రానుంది.

News June 4, 2024

సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి గెలుపు

image

ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. సంతనూతలపాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఏన్ విజయ్ కుమార్ ఘన విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి, మంత్రి మేరుగా నాగార్జునపై 30,385 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంతనూతలపాడును టీడీపీ కైవసం చేసుకోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News June 4, 2024

37వేల మెజారిటీతో కాల్వ ఘన విజయం

image

రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించారు. కాల్వ శ్రీనివాసులు మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తూ ముందంజలో దూసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 22 రౌండ్లు పూర్తయ్యేసరికి 37,268 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపాల్సి ఉంది.