India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*24న టెక్కలిలో సీఎం జగన్ బస్సుయాత్ర ముగింపు
*శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
* 22న అచ్చెన్నాయుడు నామినేషన్
*శ్రీకాకుళం: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
* నందిగం రహదారిపై కారు బోల్తా
*చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు: ధర్మాన
*దిల్లీలో పాలకొండ సైనికుడు మృతి
*కొత్తూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి లభ్యం
*15న పలాసకు చంద్రబాబు రాక
* రాజాంలో రూ.20 లక్షల నగలు స్వాధీనం
* నరసన్నపేటలో వాలంటీర్ల రాజీనామా
ఎన్నికలకు సంబంధించి ఏ అంశంపై నైనా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, ఫిర్యాదులు చేయడానికి జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబరు 1950ను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఓటరు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ నంబరుకు ఫోన్ చేస్తే చాలు సమాధానం ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు చేసేందుకు ప్రతి పౌరునికి హక్కు ఉంది.
ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలు రావడం, ఆదివారం తమిళ ఉగాది కావడంతో శనివారం తిరుమలలో భక్తల రద్దీ పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తిరుమలకు వస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. సర్వ దర్శనానికి 20 గంటలు సమయం పడుతుందన్నారు.
చదువుకి పేదరికం అడ్డు కాదని కోసిగికి చెందిన S.లోకేష్ నిరూపించాడు. కోసిగి ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్ బైపీసీలో 964 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు బెంగళూరుకి వలస వెళ్లారు. కుటుంబానికి అండగా ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని విద్యార్థి తెలిపాడు.
ధర్మవరం పట్టణం యాదవ వీధికి చెందిన ఒక చిరు వ్యాపారి కూతురు ఓలేటి వర్షిత సత్యసాయి జిల్లా మొదట ర్యాంక్ను సాధించింది. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 466/470 మార్కులు సాధించి ఔరా అనిపించింది. ఇంటర్ ఫలితాలలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. తమ కూతురుకి చదువు చెప్పిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు.
జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం గ్రామంలో జరిగిన కర్రెమ్మ దేవత ఉత్సవాల సందర్భంగా దేవతకు బలి ఇచ్చిన దున్నపోతు మాంసం కోసం ఇరు వర్గాలకు చెందిన యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పదిమందికి గాయాలయ్యాయి. అందులో ఒకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్ద కూడా యువకులు ఘర్షణ పడటంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
పుంగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ కార్యాలయం శనివారం తెలిపింది. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
పెదకూరపాడు మండలం లింగంగుంట్లలో పంటకాల్వ తవ్వుతూ పనిచేసే ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. లింగంగుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన ఎనుబర్ల బాబు(50) లింగంగుంట్ల-పెదకూరపాడు మార్గంలో కందకం తవ్వకం పనులకు వెళ్లి రెండు గజాలు మట్టి తవ్వి ఎండవేడికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు పెదకూరపాడు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తెనాలి నియోజకవర్గంలో ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ తెనాలి వస్తారని చెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. గతంలో అనారోగ్యం వలన పవన్ తెనాలి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ అన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి అయినందున వాటిని సంఘాల తరలింపు ప్రక్రియను కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద జరుగుతున్న ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రతి ఒక్కటి విధిగా పాటించాలన్నారు.
Sorry, no posts matched your criteria.