India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెనాలి నియోజకవర్గంలో ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ తెనాలి వస్తారని చెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. గతంలో అనారోగ్యం వలన పవన్ తెనాలి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.
ఈడుపుగల్లులో శ్రీపతి శ్రావ్య (25)అనే వివాహిత శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావ్య డైరీ కనిపించడం లేదని, ఆ డైరీని స్వాధీనం చేసుకుంటే నిజాలు బయటకు వస్తాయని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2019లో గెలుపొందిన పలువురు MLAలకు ఈ సారి టికెట్ రాకపోవడంతో ఉభయ గోదారిలో రాజకీయం వేడెక్కింది. చింతలపూడిలో YCP MLA ఎలీజాను మార్చగా ఆయన కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకొన్నారు. పి.గన్నవరం YCP MLA చిట్టిబాబుకు సైతం టికెట్ ఇవ్వకపోగా ఆయనా కాంగ్రెస్లో చేరారు. ఇక ఉండిలో TDP సిట్టింగ్ MLAలకు ఆ పార్టీ తొలుత టికెట్ ఇచ్చినా.. ఇతరులకు కేటాయిస్తారనే టాక్తో సందిగ్ధత నెలకొంది.
2019లో గెలుపొందిన పలువురు MLAలకు ఈ సారి టికెట్ రాకపోవడంతో ఉభయ గోదారిలో రాజకీయం వేడెక్కింది. చింతలపూడిలో YCP MLA ఎలీజాను మార్చగా ఆయన కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకొన్నారు. పి.గన్నవరం YCP MLA చిట్టిబాబుకు సైతం టికెట్ ఇవ్వకపోగా ఆయనా కాంగ్రెస్లో చేరారు. ఇక ఉండిలో TDP సిట్టింగ్ MLAకు ఆ పార్టీ తొలుత టికెట్ ఇచ్చినా.. ఇతరులకు కేటాయిస్తారనే టాక్తో సందిగ్ధత నెలకొంది.
కందుకూరు నియోజకవర్గం జాతీయ రహదారి తేట్టు వద్ద స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్పోస్ట్ను కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరిశీలించారు. కందుకూరు నియోజక వర్గంలోని టి.ఆర్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పిఓలకు , ఏపిఓలకు నిర్వహిస్తున్న ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించారు. అనంతరం కావలి నియోజకవర్గం జాతీయ రహదారి రుద్రకోట స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఓ లాడ్జిలో యువకుడు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కరప మండలం వేళంగికి చెందిన అనిల్కుమార్(25) క్రికెట్ బెట్టింగ్కు అలవాటయ్యాడు . దానికి తోడు చెడు వ్యసనాలకు బానిస కావడం, బెట్టింగ్ కారణంగా అప్పులు ఎక్కువ కావడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. శుక్రవారం లాడ్జిలో రూం తీసుకున్న అనిల్.. ఆత్మహత్య చేసుకున్నట్లు SI తెలిపారు.
శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా రీసెర్చ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రజిని ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయి. పిజి డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ/ ఫార్మసిటికల్ సైన్స్/ ఎంటెక్ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన వారు అర్హులు. ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22.
పాలకొండ మండలం గొట్ట మంగళాపురం గ్రామానికి చెందిన సామంతుల రాంబాబు (31) ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన హోలీ సంబరాల్లో విద్యుత్ షాక్కు గురై ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా మృతునికి 8 నెలల క్రితమే వివాహమైంది. నేడు ప్రత్యేక విమానంలో సైనికుని మృతదేహం స్వగ్రామానికి తీసుకురానున్నారు.
సంతమాగులూరు ఎంపీడీవో కార్యాలయ సమీపంలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రమైన ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు పాఠశాలలోపలికి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దెబ్బతినగా ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. జిల్లాలోని ఏఎస్ పేట, చిన్న బజారు తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో శనివారం కవాతు నిర్వహించారు. ప్రజలు భయాన్ని వీడి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.