Andhra Pradesh

News March 12, 2025

P4 సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి: కలెక్టర్

image

ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం (P4)తో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛఆంధ్ర @ 2047 గోడపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @ 2047 దిశగా ముందడుగు వేస్తోందన్నారు. 

News March 12, 2025

మచిలీపట్నం: సిమెంట్ ఫ్యాక్టరీకి ప్లాస్టిక్ వ్యర్ధాలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్తుల నుంచి ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, గ్లాసులు ఒకచోట పోగుచేసి వాటిని పంచాయతీ వాహనాల ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించాలన్నారు. 

News March 12, 2025

గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచనలు

image

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చే ప్రజలను గౌరవించి మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్లో ఎటువంటి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, గుర్తులు ఉన్నవి వాడటానికి వీలులేదని స్పష్టం చేశారు.

News March 11, 2025

కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤కర్నూలు: ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డీబార్➤ ఆదోని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి➤ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ➤ బీటీ నాయుడి ఆస్తులు రూ.5.68కోట్లు ➤ ఆలూరు: వైసీపీ ‘యువత పోరు’ అంటూ కొత్త డ్రామా➤ నటుడు పోసానికి ఆదోని కేసులో బెయిల్ మంజూరు➤ నందవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి➤ వైసీపీపై మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జి మండిపాటు ➤ పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ బస్సు సౌకర్యం

News March 11, 2025

ATP: అన్ని అంశాల్లో జిల్లా టాప్ – 6లో ఉండాలి- కలెక్టర్

image

పంచాయతీ సెక్టర్, GSWS తదితర అంశాలలో అనంతపురం జిల్లా టాప్ – 6లో ఉండేందుకు అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పలు శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. MSME సర్వేలో పురోగతి తీసుకొచ్చి 24 గంటల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 11, 2025

అవనిగడ్డ: రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించిన కలెక్టర్

image

అవనిగడ్డ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్‌ను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తేదీలను సంబంధిత రిజిస్టర్‌లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ట్యాంక్‌ను శుభ్రపరిచి ప్రజలకు మంచినీటిని అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు.

News March 11, 2025

SKLM: పార్లమెంటులో అరకు కాఫీ ఘుమఘుమలు

image

ఏపీలో గిరిజన ప్రాంతాలలో పండించే అరకు వ్యాలీ కాఫీ ప్రత్యేకతను పార్లమెంటులో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం ఆయనకు అందజేశారు. సేంద్రీయ సాగైన అరకు కాఫీ గొప్ప రుచికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ‘మన్ కీ బాత్’ లో ఈ కాఫీ ప్రత్యేకతను ప్రశంసించారు.

News March 11, 2025

పోలీసులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ

image

గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ నిర్వహించారు. జవాబుదారీగా పని చేసి ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెంచి, కేసులు తగ్గించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాల అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News March 11, 2025

సోమందేపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

సోమందేపల్లిలోని పాతఊరులో మంగళవారం విద్యార్థిని పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఈడిగ సురేశ్, సుధారాణిల కుమార్తె పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం విద్యార్థి ఇంటిలో ఉరేసుకుని మరణించింది. విద్యార్థి తన చావుకు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు నాన్న అని రాసి ఉన్న లెటర్‌ను ఎస్ఐ రమేశ్ బాబు, ఏఎస్ఐ మురళి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2025

SKLM: జిల్లా అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాలి

image

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, గ్రామ సచివాలయం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై చర్చించారు.