India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైయస్ షర్మిల మూడు రోజులు పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తిలో, సాయంత్రం 4 గంటలకు సత్యవేడులోని గాంధీ విగ్రహం సమీపంలో, రాత్రి 7.30కు పుత్తూరులో నాయకులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం 10.30 కార్వేటినగరంలో రోడ్డుషో, సమావేశం, 11.30 జీడీనెల్లూరులో, సాయంత్రం 5 గంటలకు పలమనేరు, రాత్రి 7.30 గంటలకు పూతలపట్టులో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. 16న అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తారు.
ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24 వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గుంటూరు జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 18 నుంచి 24 వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారి NSVL నరసింహం తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..
ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏలూరు జిల్లా వృత్తి విద్యాధికారి బి.ప్రభాకర్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఈ రెండు నెలల సమయం చేపలు సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు.
కృష్ణగిరి మండలం యాగంటి పల్లెకు చెందిన ఎరుకల శంకర్ రైతు. మొదటి కూతురు అనురాధ గతేడాది వెల్దుర్తి బాలికల హాస్టల్లో ఉంటూ పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం పాణ్యం మండలం నెరవాడలో గల మహాత్మ గాంధి జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఇంటర్లో చేరింది. ఫస్టియర్ బైపీసీలో 425/440 మార్కులు సాధించి మండలంలోనే మొదటి స్థానాన్ని సాధించి ప్రతిభను చాటుకుంది.
ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తామని సత్యసాయి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి ఇప్పటికే ఒక విడత శిక్షణ పూర్తి చేశామని, మరోసారి శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
భూమి కబ్జా చేయడమే కాకుండా, అడ్డుకున్న తల్లి,కూతురిపై ఇనుప రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మదనపల్లెలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోళ్లబైలు గ్రామం బయారెడ్డి కాలనీలోని వెంకటరమణాచారి తన అనుచరులతో స్థానికంగా ఉండే తల్లీకూతుళ్లు సరోజమ్మ, అనురాధల భూమిని కబ్జా అడ్డుకోవడంతో వెంకటరమణాచారి, యశ్వంత్ మరి కొంతమంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
విజయనగరం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. మోటార్ బోట్లు, మెకనైజ్డ్ బోట్ల ద్వారా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు సూచించారు. ఆ నిషేధించిన కాలంలో చేపలు సంతానోత్పత్తి పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫెయిలైన, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజును సంబంధిత కళాశాలలో ఈ నెల 18 నుంచి 24వ తేదీ లోపు చెల్లించాలని కోరారు. ప్రాక్టికల్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే ఒకటి నుంచి 4 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.