India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ప.గో. జిల్లాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్కు 1,64,291 ఓట్లు రాగా.. 42177 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. కాగా వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్కు 1,22,114 ఓట్లు వచ్చాయి. అటు నరసాపురంలో బీజేపీ అభ్యర్థి 1,98,676 ఓట్లు రాగా 72738 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి ఉమాబాలకు 1,25,938 ఓట్ల వచ్చాయి.

కడప జిల్లాలో ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. వైసీపీ 4 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కూటమి అభ్యర్థులు 6 చోట్ల ముందంజలో ఉన్నారు. పులివెందుల, బద్వేల్, రాయచోటి, రాజంపేటలో అధికార పార్టీనేతలు ఆధిక్యంలో ఉన్నారు. కోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, కడపలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేవలం నూజివీడులో మాత్రమే ప్రస్తుతానికి వైసీపీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఉమ్మడి కృష్ణాలో టీడీపీ, జనసేన, BJP శ్రేణులు భారీ స్థాయిలో సంబరాలకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో కార్యాలయాల వద్దకు భారీగా ఆ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 32,834 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి హరీష్ మాధుర్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఎక్కడ వైఎస్ఆర్సిపి తరఫున రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేశారు.

జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 7వ రౌండ్లో ఓట్లు ఇలా..
➢ ఆదినారాయణ రెడ్డి: 34346
➢ సుధీర్ రెడ్డి: 28935
➠ 7వ రౌండ్ ముగిసే సరికి ఆదినారాయణ రెడ్డి 5411 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

మూడో రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్లో వెంకట్రావుకి 12,637 ఓట్లు పోలవ్వగా.. బొత్స సత్యనారాయణకి 11,717 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

కడప అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యత కొనసాగుతున్నది. 8వ రౌండు ముగిసేసరికి 6013 ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా 27841 ఓట్లు రాగా మాధవిరెడ్డికి 33854 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ ఖాన్కు 9094 ఓట్లు వచ్చాయి. లీడింగ్ చూస్తుంటే రౌండ్ రౌండ్కి ప్రజల్లో ఉత్కంఠత నెలకొంటుంది.

ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ 8వ రౌండ్ లో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి 43,129 ఓట్లు. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 33,024 ఓట్లు వచ్చాయి. నంద్యాల వరద రాజుల రెడ్డి 10,105 లీడ్లో కొనసాగుతున్నారు.
7వ రౌండ్లో టీడీపీ అభ్యర్థికి 36,477, వైసీపీ అభ్యర్థికి 30,285 ఓట్లు వచ్చాయి.

ఆచంట నియోజకవర్గంలో 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి MLA అభ్యర్థి పితాని సత్యనారాయణ 24895 ఓట్లు సాధించగా.. 6581 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న చెరుకువాడ శ్రీ రంగనాథ రాజుకు 18314 ఓట్లు వచ్చాయి.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేసిన అభ్యర్థులలో కూటమి నాయకులు మంగళవారం జరుగుతున్న ఓట్లు లెక్కింపులో ప్రతి రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆమదాలవలస.. కూన రవికుమార్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం బి అశోక్, పలాస, శిరీష, పాతపట్నం.ఎం గోవిందరావు, శ్రీకాకుళం.. గొండు శంకర్, నరసన్నపేట.. బి రమణమూర్తి, రాజాం..కే మురళీమోహన్ ఆధిపత్యంలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.