India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ 8వ రౌండ్ లో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి 43,129 ఓట్లు. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 33,024 ఓట్లు వచ్చాయి. నంద్యాల వరద రాజుల రెడ్డి 10,105 లీడ్లో కొనసాగుతున్నారు.
7వ రౌండ్లో టీడీపీ అభ్యర్థికి 36,477, వైసీపీ అభ్యర్థికి 30,285 ఓట్లు వచ్చాయి.

ఆచంట నియోజకవర్గంలో 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి MLA అభ్యర్థి పితాని సత్యనారాయణ 24895 ఓట్లు సాధించగా.. 6581 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న చెరుకువాడ శ్రీ రంగనాథ రాజుకు 18314 ఓట్లు వచ్చాయి.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేసిన అభ్యర్థులలో కూటమి నాయకులు మంగళవారం జరుగుతున్న ఓట్లు లెక్కింపులో ప్రతి రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆమదాలవలస.. కూన రవికుమార్, టెక్కలి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం బి అశోక్, పలాస, శిరీష, పాతపట్నం.ఎం గోవిందరావు, శ్రీకాకుళం.. గొండు శంకర్, నరసన్నపేట.. బి రమణమూర్తి, రాజాం..కే మురళీమోహన్ ఆధిపత్యంలో ఉన్నారు.

ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక మంగళవారం ఉదయం స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల లోపల, పరిసర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ప్రతి పాయింట్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు.

నెల్లూరు జిల్లాలో TDP ఆధిక్యత కనబరుస్తోంది. నెల్లూరు TDP ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. TDP అభ్యర్థులు నెల్లూరు సిటీలో నారాయణ, రూరల్లో కోటంరెడ్డి, ఉదయగిరిలో సురేశ్, గూడూరులో సునీల్, పేటలో విజయశ్రీ, కావలిలో కావ్య, కోవూరులో ప్రశాంతి రెడ్డి, వెంకటగిరిలో కురుగోండ్ల ముందంజలో ఉండగా.. ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థి మేకపాటి లీడింగ్లో ఉన్నారు. సర్వేపల్లిలో హోరాహోరిగా సాగుతోంది.

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 9 చోట్ల టీడీపీ, 5 చోట్ల జనసేన, ఒకచోట వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దాదాపు అన్నీచోట్ల 3 రౌండ్లు పూర్తయ్యాయి. పోలవరంలో వైసీపీ అభ్యర్థి లీడ్ లో ఉండగా.. అక్కడ మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి 62 ఓట్ల లీడ్ ఉంది.

ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 12 స్థానాలకు టీడీపీ -8, వైసీపీ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. దర్శి, గిద్దలూరు, వై.పాలెం, కనిగిరిలో ఇప్పటివరకు వైసీపీ లీడింగ్ లో ఉండగా, అద్దంకి, కొండపి, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాల, పర్చూరులో టీడీపీ ముందంజలో ఉంది.

మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి పేర్ని కిట్టుపై 1979 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

పామర్రులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కైలే అనీల్ పై 2403 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభర్థి వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి బీటెక్ రవి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠4 రౌండ్లో పోలైన ఓట్లు ఇలా..
➢ వైఎస్ జగన్: 21580
➢ బీటెక్ రవి: 8959
వైఎస్ జగన్ 12000+ ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.