India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడపలో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 4వ రౌండ్లో ఓట్లు ఇలా..
➢ వైఎస్ అవినాష్ రెడ్డి: 20,085
➢ భూపేశ్ రెడ్డి: 6903
➢ వైఎస్ షర్మిల: 5410 ➠ 4వ రౌండ్ ముగిసే సరికి వైఎస్ అవినాష్ రెడ్డి 13వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు, ఓట్ల వివరాలు నమోదుకు సంబంధించి అక్కడ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 12,065 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ పవన్ మొదటి నుంచి ఆధిక్యం కనబరుస్తున్నారు.

కాకినాడ MP జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 3,400 ఓట్ల లీడ్తో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ బరిలో ఉన్నారు. .

వెంకటగిరిలో ఇప్పటి వరకు మొదటి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు కురుగొండ్ల రామకృష్ణకు 4,717 ఓట్లు వచ్చాయి. దీంతో సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి 274 ఓట్లతో వెనుకపడ్డారు.

శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్లో రామ్మోహన్కు 17,824 ఓట్లు పోలవ్వగా.. పేరాడ తిలక్కి 9584 ఓట్లు పడ్డాయి. దీంతో రామ్మోహన్ 8240 మెజార్టీ పొందారు.

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కూటమి రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్పై 30,743 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్కు పురందీశ్వరి ఆధిక్యం కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదవ రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.

పుంగనూరులో ఇప్పటి వరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. వరుసగా రెండో రౌండ్లోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థికి 11,359 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్లోనూ 501 ఓట్లతో వెనుకంజలోనే ఉన్నారు.

గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. సమీప ప్రత్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 19,207 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం పెమ్మసానికి 41,909 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రోశయ్యకు 22,702 ఓట్లు వచ్చాయి.

పుంగనూరులో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుపడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 5,685 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం చల్లా 136 ఓట్ల స్వల్వ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.