India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని సిరిపురం శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనాన్ని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలానికి చెందిన రాజకుమార్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు.
విశాఖలోని సిరిపురం శ్రీలక్ష్మి గణపతి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనాన్ని కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలానికి చెందిన రాజకుమార్(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు కేసు దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో ఈనెల 18 నోటిఫికేషన్ రానుందని.. అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలో నిన్నటి రంజాన్ వేడుకల్లో ఉద్రిక్తతకు కారణమైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులు విజయానందరెడ్డి, గురుజాల జగన్మోహన్పై 171 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మొదటి రేండమైజేషన్ శుక్రవారం పూర్తి అయ్యింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రేండమైజేషన్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రేండమైజేషన్ విధానాన్ని వివరించారు. రేండమైజేశన్ ద్వారా ఏ ఈవీఎం ఏ నియోజక వర్గానికి వెళుతుందో వివరించారు.
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్రెడ్డి శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈయనతో పాటు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఏపీ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు సైతం ఇదే దారిలో నడిచారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు.
నెల్లూరు వీఆర్ లా కళాశాల విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెమిస్టరు, 6వ సెమిస్టరు పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 6వ సెమిస్టర్ పరీక్షలతో కోర్స్ పూర్తి కానుంది. మే 8న మొదటి సెమిస్టరు విద్యార్థులకు, మే 2న 6వ సెమిస్టరు విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి.
ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: విశాఖలో 38,818 మందికి గానూ 30,050 మంది(77%)..అనకాపల్లిలో 10,443 మందికి 5,442 మంది(52%).. అల్లూరిలో 5,623 మందికి 2,689 మంది (48%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: విశాఖలో 34,672 మందికి గానూ 29,258 మంది (84%).. అనకాపల్లిలో 9,248 మందికి 6,119 మంది(66%).. అల్లూరిలో 4,542 మందికి 3,172 (70%) మంది పాసయ్యారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: ప.గో జిల్లాలో 15,645 మందికి గానూ 10,843 మంది (69%).. ఏలూరు జిల్లాలో 13,078 మందికి గానూ 9,421 మంది (72%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: ప.గో జిల్లాలో 13,161 మందికి గానూ 10,470 మంది (80%).. ఏలూరు జిల్లాలో 11,539 మందికి గానూ 9,211 మంది (80%) పాసయ్యారు.
ఉమ్మడి తూ.గో వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు.. పాసైన వారి సంఖ్య ఇలా ఉంది.
➠ ఫస్ట్ ఇయర్: తూ.గోలో 19,039 మందికి గానూ 14,357 మంది(75%).. కాకినాడలో 19,656 మందికి 11,873 మంది(60%).. కోనసీమలో 10,745 మందికి 6,444 మంది (60%) పాసయ్యారు.
➠ సెంకడ్ ఇయర్: తూ.గోలో 15,394 మందికి గానూ 12,837 మంది (83%).. కాకినాడలో 15,969 మందికి 11,337 మంది(71%).. కోనసీమలో 8,844 మందికి 6,338 మంది (72%) పాసయ్యారు.
ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఇయర్లో 18,349 మందికి 10,868 మంది పాసయ్యారు. దీంతో 59 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 15,238 మందికి 10,993 మంది విద్యార్థులు పాసయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 15వ స్థానం సాధించింది. మొదటి సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో మెరుగైన ఫలితాలు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.