Andhra Pradesh

News April 12, 2024

చిత్తూరు: ఫస్ట్ ఇయర్‌లో సగం మంది ఫెయిల్

image

ఇంటర్ సెకండ్ ఇయర్‌లో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలవగా ఫస్ట్ ఇయర్‌ విద్యార్థులూ నిరాశపరిచారు. 50 శాతంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. 13,224 మంది పరీక్షలు రాయగా 6,566మంది పాసయ్యారు. తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. అన్నమయ్య జిల్లా 53 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 12,978 మంది పరీక్షలు రాయగా 6,886 మంది పాసయ్యారు.

News April 12, 2024

శ్రీకాకుళం: ఫస్టియర్‌లో 21, సెకండియర్‌లో 24వ స్థానం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ పరీక్షలను 18,249 మంది రాయగా.. వారిలో 10,408 మంది ఉత్తీర్ణత సాధించారు. 57 శాతంతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 16,769 మందికి 11,300 మంది పాసయ్యారు. 67%తో 24వ స్థానంలో ఉంది.

News April 12, 2024

పార్వతీపురం 11వ స్థానం.. విజయనగరం 13వ స్థానం

image

➠ విజయనగరంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 16,584 మందికి 10,267 మంది పాసయ్యారు. 62%తో రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 15,180 మందికి 10,591 మంది పాసయ్యారు. 70%తో 21వ స్థానంలో ఉంది.
➠ పార్వతీపురం మన్యం జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 5,475 మందికి 3,565 మంది ఉత్తీర్ణత సాధించారు. 65 శాతంతో 11వ స్థానంలో ఉంది. సెకండ్ ఇయర్‌లో 5,292 మంది రాయగా..4,054 మంది పాసయ్యారు. 77%తో 11వ స్థానంలో ఉంది.

News April 12, 2024

ఇంటర్ ఫలితాల్లో కర్నూల్, నంద్యాల జిల్లా స్థానాలు

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కర్నూల్ జిల్లా 68% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 10వ స్థానంలో, నంద్యాల 59% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 19818 మందికి 13394 మంది.. నంద్యాలలో 12022 మందికి 7102 మంది పాసయ్యారు. సెకండియర్లో కర్నూల్ 76% ఉత్తీర్ణతతో 12వ స్థానం, నంద్యాల జిల్లా 70% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 17294 మందికి 13210 మంది, నంద్యాలలో 9165 మందికి 6429 మంది పాసయ్యారు.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలలో మన గుంటూరు రెండో స్థానం

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 81 శాతంతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది.30,306 మంది పరీక్షలు రాయగా 24,536 మంది పాసయ్యారు. పల్నాడు జిల్లా 65 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. 13,651 మంది పరీక్షలు రాయగా 8,874 మంది పాసయ్యారు. బాపట్ల జిల్లా 61 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 8230 మంది పరీక్షలు రాయగా 5010 మంది పాసయ్యారు.

News April 12, 2024

నెల్లూరు జిల్లాకు 8వ స్థానం

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 69 శాతంతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. 21,293 మందికి 17,292 మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలవగా.. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో ఇదే జిల్లా 81 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 25,990మందికి 21,062 మంది పాసయ్యారు.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలలో మన గుంటూరు రెండో స్థానం

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 87 శాతంతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. 26,007 మంది పరీక్షలు రాయగా 22,673 మంది పాసయ్యారు. పల్నాడు జిల్లా 73 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. 12,087 మంది పరీక్షలు రాయగా 8,870 మంది పాసయ్యారు. బాపట్ల జిల్లా 71 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 7995 మంది పరీక్షలు రాయగా 5709 మంది పాసయ్యారు.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలు: నాలుగో స్థానంలో విశాఖ

image

➠ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విశాఖ జిల్లా 77 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ 84 శాతంతో 4వ స్థానంలో ఉంది.
➠ కాకినాడ జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 52 శాతంతో 24వ స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 66శాతంతో 25వ స్థానంలో నిలిచింది.
➠ అల్లూరి సీతారామరాజు జిల్లా ఫస్ట్ ఇయర్‌లో 48 శాతంతో 26 స్థానంలో ఉండగా.. సెకండ్ ఇయర్‌లో 70 శాతంతో 20వ స్థానంలో నిలిచింది.

News April 12, 2024

ఇంటర్ ఫలితాల్లో అనంత, సత్యసాయి జిల్లా స్థానాలు

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అనంత జిల్లా 60% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 16వ స్థానంలో, సత్యసాయి 58% ఉత్తీర్ణతతో 20వ స్థానంలో నిలిచింది. అనంతలో 21826 మందికి 13115 మంది.. సత్యసాయిలో 9878 మందికి 5769 మంది పాసయ్యారు. సెకండియర్లో అనంత జిల్లా 78% ఉత్తీర్ణతతో 10వ స్థానం, సత్యసాయి జిల్లా 76 % ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. అనంతలో 15653 మందికి 12210 మంది, సత్యసాయిలో 7447 మందికి 5653 మంది పాసయ్యారు.

News April 12, 2024

కడప: ఇంటర్‌లో ఎంతమంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. కడప జిల్లాలో మొదటి సంవత్సరానికి సంబంధించి 14,470 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 7,954 మంది పాస్ అయ్యారు. 55 శాతం ఉత్తీర్ణతతో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 12,131 మందికి గాను, 8,375 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 69 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొదటి సంవత్సరం కంటే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కడప జిల్లా విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చాయి.