Andhra Pradesh

News March 11, 2025

గృహ నిర్మాణాలకు అదనంగా నగదు అందజేత

image

2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్‌ తెలిపారు. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అందజేస్తామన్నారు.

News March 11, 2025

ATP: విద్యాశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

image

నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు కల్పించేలా విద్యాశాఖ, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. GO నంబర్ 117 తో గతంలో 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో కలపడం జరిగిందని, బేసిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. 3 కి.మీ లోపల హైస్కూల్ లేని చోట తగు ఏర్పాట్లు చేసి, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.

News March 11, 2025

నాగాయలంక: పనులను పునః ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే  

image

నాగాయలంకలోని జలక్రీడల శిక్షణ కేంద్ర నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌లు శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను పునః ప్రారంభించారు. సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. జలక్రీడలపై నాగాయలంక అనువైన ప్రదేశమన్నారు. జాతీయ స్థాయి క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఈ ప్రాంతం వాసి కావటంతో భవిష్యత్తులో నాగాయలంకకు దేశంలోనే గొప్ప ప్రఖ్యాతులు రానున్నాయని ఆశించారు. 

News March 11, 2025

విశాఖ నుంచి పట్నాకు ప్రత్యేక రైళ్ళు

image

హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి పట్నాకు స్పెషల్ (08537/38) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి మార్చి 16, 23, 30 తేదీలలో బయలుదేరి మరుసటి రోజు పట్నాకు చేరుతాయి. మళ్లీ మార్చి 17, 24, 31 తేదీలలో పాట్నా నుంచి బయలుదేరి విశాఖ చేరుతాయని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News March 11, 2025

సీఆర్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

image

వెలగపూడిలోని అసెంబ్లీలోని ఛాంబర్‌లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు విషయాలపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పొంగూరు నారాయణ, కేశవ్ పయ్యావుల, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News March 11, 2025

శ్రీకాకుళం: హోటళ్లు, లాడ్జీలకు గ్రీన్ లీఫ్ రేటింగ్

image

శ్రీకాకుళం జిల్లా ఉన్న హోటళ్లు, లాడ్జీలకు గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మంగళవారం సమన్వయ హోటళ్లు, లాడ్జీల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. “ఈ వినూత్న వ్యవస్థ హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లలో పరిశుభ్రతను నిర్ధారించడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తుందని అన్నారు.

News March 11, 2025

నటుడు పోసానికి బెయిల్ మంజూరు

image

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనకు కర్నూలు మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ (జేఎఫ్‌సీఎం) బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత ఫిర్యాదుతో గతేడాది ఆదోని పీఎస్‌లో పోసానిపై కేసు నమోదైంది.

News March 11, 2025

VZM: పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..

image

విజయనగరం జిల్లాలో ఓ తల్లి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వంగర మండలంలో మంగళవారం జరిగింది. కింజంగి గ్రామానికి చెందిన కళింగ శ్రావణి (30), కుమారుడు సిద్దు (9), కుమార్తె సైని (6)తో కలిసి మడ్డువలస కుడి కాలువలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు తల్లి, కుమారుడిని కాపాడారు. కుమార్తె గల్లంతైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2025

ATP: వంకర పాదాలతో పుట్టిన పిల్లలకు చికిత్స

image

అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టుకతో వంకర పాదాలతో పుట్టిన పిల్లలకు మంగళవారం వైద్యులు చికిత్సను అందించారు. ఈ సందర్భంగా డీఈఐసీ మేనేజర్ రజిత మాట్లాడుతూ.. త్వరిత చికిత్స కేంద్రంలో వంకర పాదాలతో పుట్టిన 10 రోజులలోపు పిల్లలకు కాస్టింగ్ చేయడమే కాకుండా, అవసరమయిన వారికి ఉచితంగా స్ప్లింట్‌లను అందించామన్నారు. అలాగే పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి చికిత్సను అందిస్తామన్నారు.

News March 11, 2025

కర్నూలు: ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్

image

జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలో చూచి రాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డిబార్ చేసినట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 24,729 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 23,979 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 739 విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదు. నగరంలోని గవర్నమెంట్ ఒకేషనల్ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు.