Andhra Pradesh

News June 4, 2024

2019లో 223 మంది.. ప్రస్తుతం 254 మంది

image

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా 254 మంది పోటీలో నిలిచారు. 2019 ఎన్నికల్లో 19 నియోజకవర్గాల పరిధిలో 223 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా కాకినాడ నగరం, గ్రామీణం, ప్రత్తిపాడు, ముమ్మిడివరం నియోజకవర్గాల నుంచి 15 మంది వంతున అభ్యర్థులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేశారు.

News June 4, 2024

అదృష్టం పరీక్షించుకొనున్న 134మంది అభ్యర్థులు

image

అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ, అనంతపురం పార్లమెంట్ నుంచి 134మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో అనంతపురం పార్లమెంట్ నుంచి 21మంది, 8 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి 113మంది అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జూన్ 4 జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇప్పటికే అధికారులు కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. మరి కొన్ని గంటల్లో భవితవ్యం తెలనుంది.

News June 4, 2024

శ్రీకాకుళం: బరిలో 86 మంది అభ్యర్థులు తేలనున్న భవితవ్యం

image

అసెంబ్లీ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీకాకుళం 8 నియోజకవర్గాలో మొత్తం 86 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఇచ్ఛాపురం అసెంబ్లీకి 9 మంది, పలాస-10, టెక్కలి-7, పాతపట్నం-10, శ్రీకాకుళం-7, ఆమదాలవలస-13, ఎచ్చెర్ల-10 నరసన్నపేట-7 మంది పోటీ చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 13 మంది నిలిచారు. తొలుత ఆమదాలవలస, చివరగా పాతపట్నం ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

News June 4, 2024

విశాఖ: మూడు వేల మందితో బందోబస్తు

image

ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పోలీసులు భారీ భద్రత చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. 3000 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. నగరం అంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. 133 సున్నితమైన ప్రాంతాలను గుర్తించామన్నారు. 137 పోలీస్ పికెట్, 79 పెట్రోలింగ్ పార్టీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక క్విక్ రియాక్షన్ టీంలను సిద్ధం చేసినట్లు తెలిపారు.

News June 4, 2024

అనంత: గరిష్ఠ ధర రూ.38,000

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.38 వేలు, కనిష్ఠంగా రూ.15 వేలు, సరాసరి రూ.25 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. సోమవారం అనంతపురం మార్కెట్‌కు మొత్తంగా 720 టన్నుల చీనీకాయలు వచ్చాయని జయలక్ష్మి తెలిపారు. మార్కెట్లో చీనీకాయలు గరిష్ఠంగా రూ. 38 వేలతో అమ్ముడు పోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

News June 4, 2024

మొదటిగా మంత్రాలయం.. చివరన పాణ్యం ఫలితాల వెల్లడి

image

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సగటున 10 గంటల నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొదటిగా మంత్రాలయం.. చివరన పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు వెళ్లడి కానున్నాయి.

News June 4, 2024

ప.గో.: రాష్ట్రంలో తొలిఫలితం నరసాపురందే

image

రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నరసాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. 1వ రౌండ్లో కె.బేతపూడి, మల్లవరం, సరిపల్లి, చినమామిడిపల్లి, చిట్టవరం, గొంది, పాతనవరసపురం, కొత్తనవరసపురం, నరసాపురం వలందరరేవు ప్రాంతం ఓట్లు లెక్కించనున్నారు. పోస్టల్
బ్యాలెట్ల లెక్కింపునకు 4 టేబుళ్లు, పోలింగ్ బూత్‌ల వారీగా
169 ఈవీఎంలలో ఓట్లు లెక్కించేందుకు 14 టేబుళ్లు ఏర్పాటుచేశారు.

News June 4, 2024

2 గంటలకు నెల్లూరు సిటీ ఫలితం?

image

నెల్లూరు సిటీ 18, సర్వేపల్లి 21, కావలి 23 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. కందుకూరు, ఆత్మకూరు 20 రౌండ్లలో, కోవూరు, ఉదయగిరి 24.. నెల్లూరు రూరల్, సర్వేపల్లి ఓట్ల లెక్కింపు 21 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్‌కు అరగంట పట్టినా.. నెల్లూరు సిటీ తుది ఫలితం మధ్యాహ్నం 2 గంటలకు తేలుతుంది. కందుకూరు, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి MLA ఎవరనేది 3 గంటలకు తెలిసిపోతుంది. మిగిలిన ఫలితాలు 4 గంటలకు వస్తాయి.

News June 4, 2024

విశాఖ: వేటకు సన్నద్ధం అవుతున్న మత్స్యకారులు

image

సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ఈ నెల 15 తో ముగియనుంది.ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో అప్పుఘర్,వాసవానిపాలెం, పెద్ద జాలరి పేటలో మత్స్యకారులు వేటకు సన్నద్ధం అవుతున్నారు. చేపల వేటకు అవసరమైన వలలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. వేట నిషేధం కారణంగా రెండు నెలలపాటు మత్స్యకారులు ఇంటికే పరిమితం అయ్యారు.

News June 4, 2024

విశాఖ: నేడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

image

ఎన్నికల కౌంటింగ్ నేపాథ్యంలో ఏయూకి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈవీఎంలను ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని భద్రపరిచారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఏయూ కళాశాలలో మంగళవారం చేపడుతున్నారు. వర్సిటీలో స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏయూకు సెలవు ప్రకటించారు.