India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి వంతెనపై నుంచి రెండేళ్ల చిన్నారి సహా దంపతులు దూకి గల్లంతైన విషయం తెలిసిందే. కుటుంబ యజమాని బొంతు కిషోర్ మృతదేహాన్ని గురువారం సాయంత్రం గుర్తించారు. భార్య యోచన, కుమార్తె శ్రీనిధి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ దంపతులు పాపతో సహా గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. భీమవరానికి చెందిన వీరు 3 నెలల కింద అమలాపురానికి జీవనోపాధి నిమిత్తం వెళ్లారు.
పలు రైళ్లును రీ షెడ్యూల్ చేసిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి పేర్కొన్నారు. నిజాముద్దీన్-విశాఖ(12808) ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 15, 18 తేదీల్లో ఒక గంట ఆలస్యంగా 8 గంటలకు రీషెడ్యూల్ చేశారు. విశాఖ-భగత్ కీ కోఠి (18573)ను ఈనెల 18న 2గంటల 30నిమిషాల ఆలస్యంగా రాత్రి 7.50 గంటలకు రీషెడ్యూల్ చేశారు. నిజాముద్దీన్-విశాఖ12808) ఎక్స్ ప్రెస్ ఈ నెల 22న 2గంటల ఆలస్యంగా 9గంటలకు రీషెడ్యూల్ చేశారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 45,702 మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 43,071 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,631 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 19,937 రెండో సంవత్సరం విద్యార్థులు 25,765 మంది ఉన్నారు. ఫలితాలు వెల్లడిపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది.
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రమణయ్యపేటలో తమను నిర్భంధించి దౌర్జన్యం చేశారని వాలంటీర్లు ఫిర్యాదు చేయగా.. నానాజీతో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సర్పవరం SI శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. జనసేన నేతలు ఆరుగురు వాలంటీర్లను గదిలో నిర్భంధించి తాళం వేసి, దురుసుగా ప్రవర్తించారని అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తిరుపతి-తిరుచానూరు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. తిరుచానూరు పంచాయతీ దామినేడు ఇందిరమ్మ గృహాల్లో ఉంటున్న అజయ్, బుజబుజనెల్లూరుకు చెందిన చైతన్య పనుల నిమిత్తం గురువారం తిరుపతిలోని లక్ష్మీపురానికి వచ్చారు. తిరిగి బైకుపై వెళ్తూ వేగంగా రోడ్డు పక్కనున్న ఇనుప దిమ్మెను ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
భీమిలి మండలం తగరపువలసలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న మజ్జి రాజేష్ కుమార్ (41) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ వివాహం కూడా చేసుకోలేదు. జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వారికి చెప్పేవాడు. గురువారం తరగతి గదిలో పాఠాలు చెబుతూ నోటి నుంచి నురగలు కక్కుకుంటు కుప్పకూలి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పామిడి మండలంలోని కండ్లపల్లిలో ఓ దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన యువతిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెంబడించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రత్యర్థులు భూమా, ఇరిగెల కుటుంబాలు ఒక్కటయ్యాయి. 1992 ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్రెడ్డి పోటీచేశారు. జమ్మలమడుగు MLA శివారెడ్డి, NMD ఫరూక్ మధ్యవర్తిత్వంతో ఇరిగెల కుటుంబం నాగిరెడ్డి విజయానికి కృషిచేసింది. ఆ 2 కుటుంబాల కలయితో గెలుపు నల్లేరుపై నడకగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఏకమవ్వడంతో అఖిలప్రియ గెలుపు సులభమేనని అంచనా వేస్తున్నారు.
ఇంజినీరింగ్ పనుల నిమిత్తం నేటి నుంచి 30వ తేదీ వరకు విజయవాడ – గుంటూరు 07464, గుంటూరు – విజయవాడ 07465, గుంటూరు – విజయవాడ 07976 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హుబ్లీ – విజయవాడ 17329 రైలుని ఈ నెల 29 వరకు, విజయవాడ – హుబ్లీ 17330 రైలును ఈ నెల 30 వరకు విజయవాడ – గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
ఎలక్షన్ నోటిఫికేషన్ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలు పూర్తి చేయగా, కొందరి మార్పు అనివార్యం అని తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా విడదల రజని పోటీ చేస్తారని తెలుస్తోంది. గుంటూరు పశ్చిమం నుంచి కిలారి రోశయ్యను బరిలో దింపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Sorry, no posts matched your criteria.