India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో అపర భద్రాద్రిగా ఖ్యాతి గాంచిన కోదండ రామస్వామి వారి ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ఎత్తైన గాలి గోపురాలు గల రామాలయం ఇది ఒక్కటే. ఈ ఆలయాన్ని 1889వ సంవత్సరంలో నిర్మించారు. మయసభను తలపించేలా ఉండే అద్దాల మండపం
ఈ దేవాలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం.
బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 14 సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్ యాత్ర గుడివాడ రానున్నట్లు, గుడివాడ కొడాలి నాని కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా.. భారీ బహిరంగ సభ నాగవరప్పాడు చివర అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో స్థానిక గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని గాజువాక మినహా విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పురుష ఓటర్లు ఎక్కవగా ఉంటే.. 2024 నాటికి మహిళా ఓటర్లు వారిని అధికమించారు. లోక్ సభ పరిధిలో ఇప్పటి వరకు 19,03,175 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 9,36,667, మహిళలు 9,66,389, ఇతరులు 119 మంది ఉన్నారు.
ఏలూరులోని SVC మహల్లో హీరో నవదీప్ సందడి చేశారు. నవదీప్ నటించిన ‘లవ్ మౌళి’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఏలూరు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ.. లవ్ మౌళి చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు. రచయిత అనంత శ్రీరామ్, చిత్ర నటీమణులు, తదితరులు ఉన్నారు.
జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని కొత్త పల్లి గ్రామ సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో విద్యుత్ షాక్తో రాధమ్మ అనే మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. తన ఇంటి సమీపంలో పంచాయతీ బోరు ఉండడంతో వంట పాత్రలు కడగడానికి వెళ్ళగా.. విద్యుత్ తీగలు ఆమెకు తగలడంతో మృతి చెందినట్లు భర్త హనుమంతు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలోని రాచర్ల మండలం అనుములపల్లిలో ఉపాధి పనికి వెళ్లిన కూలీ గల్ల ఆంజనేయులు (55) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనిచేస్తుండగా ఆంజనేయులుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మిగతా కూలీలు గమనించి హుటాహుటిన రాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.
దేవనకొండ మాజీ జడ్పీటీసీ సభ్యులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి ఐదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఆలూరు నియోజకవర్గంలో ప్రాధాన్యత నెలకొంది. 12న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కోట్ల హరికి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
విశాఖ తొట్లకొండ బీచ్ రోడ్డులో జరిగిన <<13024927>>రోడ్డు ప్రమాదంలో<<>> మృతిచెందిన వారి వివరాలు వెల్లడయ్యాయి. చింతపల్లి వీరభద్ర అనే యువకుడు భీమిలి నుంచి బైక్పై విశాఖ వెళ్తున్నాడు. అదే సమయంలో రుషికొండకు చెందిన దౌలపల్లి చిన అప్పలరాజు రుషికొండ నుంచి ఉప్పాడ వైపు బైకుపై వస్తున్నాడు. వంతెన పాడైన కారణంగా వన్ వే దారిలో ఎదురెదురుగా వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం వాటిల్లింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రంజాన్ రోజున రోజు తీవ్ర విషాదం నెలకొంది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన SK ఉమర్ బీటెక్ చదువుతున్నాడు. ఇవాళ చికెన్ దుకాణంలో పనికి వెళ్లాడు. ఈక్రమంలో అతనికి కరెంట్ షాక్ తగలడంతో చనిపోయాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంబల్పూర్ డివిజన్లో సబ్ వే పనులు జరుగుతున్న కారణంగా ఈనెల 13న టాటా నుంచి బయలుదేరే టాటా ఎర్నాకులం ట్రైన్, నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని వాల్తేర్ రైల్వే డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 13 ఉదయం 5.15 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ నాలుగు గంటల ఆలస్యంగా 9.15 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.