Andhra Pradesh

News December 11, 2025

విజేత కడప జట్టు

image

పులివెందుల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటులో కడప జట్టు విజేతగా నిలిచింది. గురువారం కడప, విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు గెలుపొందింది. రెండో స్థానంలో విశాఖ, తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. ఆయా జట్ల విజేతలకు MLC రాంగోపాల్ రెడ్డి బహుమతులను అందజేశారు.

News December 11, 2025

BREAKING: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గౌతమి

image

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తతలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 11, 2025

కడప మేయర్ ఎన్నికకు టీడీపీ దూరం: వాసు

image

కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. గురువారం ఆయన కడపలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే మాధవి, టీడీపీ సభ్యులైన పలువురు కార్పొరేటర్లు ఈ ఎన్నిక సమావేశానికి హాజరు కావడం లేదన్నారు.

News December 11, 2025

కడప మేయర్ ఎన్నికకు టీడీపీ దూరం: వాసు

image

కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. గురువారం ఆయన కడపలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే మాధవి, టీడీపీ సభ్యులైన పలువురు కార్పొరేటర్లు ఈ ఎన్నిక సమావేశానికి హాజరు కావడం లేదన్నారు.

News December 11, 2025

CM సొంత నియెజకవర్గంలో గ్రానైట్ అక్రమ రవాణా.?

image

అది CM సొంత నియోజకవర్గం. అన్నిరంగాల్లో ముందుడాలని చంద్రబాబు అభివృద్ధి అంటుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం అందినకాడికి దోచుకో.. దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారట. కుప్పం గ్రానైట్‌కు మంచి డిమాండ్ ఉంది. దీంతో నాయకులు పగలు గ్రావెల్ రాత్రిళ్లు గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారట. YCP హయాంలో చంద్రబాబు దీనిపై క్వారీలోకి వెళ్లి మరీ పరిశీంచారు. మరి ఇప్పటి అక్రమ రవాణాపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

News December 11, 2025

సింహాచలంలో నెల గంట ముహూర్తం ఎప్పుడంటే ?

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధిలో నెలగంట ఉత్సవాన్ని ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 1:01 గంటకు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఆలయ వైదిక సభ్యులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో ఆలయంలో 10 రోజులు పగల్ పత్తు, మరో 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మరో ఐదు రోజులు దారోత్సవాలు, ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు తిరుప్పావై పాశురాల పఠనం నిర్వహిస్తారు.

News December 11, 2025

రాచర్ల: స్వగ్రామంలో మాజీ MLA అంత్యక్రియలు

image

మాజీ MLA పిడతల <<18527850>>రామ్ భూపాల్ రెడ్డి<<>> స్వగ్రామం రాచర్ల మండలం అనుమలవీడు గ్రామం. కాగా ఆయన ఇవాళ తెల్లవారుజామున స్వర్గస్తులైన విషయం తెలిసిందే. వారి పార్థివదేహాన్ని గురువారం అనుమలవీడుకు తరలిస్తామని, గ్రామంలోనే శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వారి తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

News December 11, 2025

గిద్దలూరు: రాజకీయంలో పిడతల కుటుంబం

image

గిద్దలూరు రాజకీయ ముఖ చిత్రంలో పిడతల కుటుంబం ప్రాధాన్యత అధికం. పిడతల రంగారెడ్డి 1937 నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్‌గా పదవులు చేపట్టారు. 1991లో ఈయన కన్నుమూశారు. 1994 ఎన్నికల్లో పిడతల రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ రెడ్డి గెలవగా.. 2001లో ఈయన మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. ఈయన సతీమణి సాయికల్పన ఎమ్మెల్యే అయ్యారు.

News December 11, 2025

నెల్లూరు: శిక్షణ పూర్తయినా.. తప్పని నిరీక్షణ.?

image

మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం కుట్టు మిషన్ల శిక్షణ చేపట్టింది. 3 నెలల పాటు ఈ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందిస్తామన్నారు. శిక్షణ పూర్తయి 3నెలలు అయినా మిషన్లు అందలేదు. మహిళలు 3 నెలల నుంచి కుట్టు మిషన్లు, ధ్రువ పత్రాలు కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 31 శిక్షణా కేంద్రాల్లో 1808 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి అయిన వారికి మిషన్లు అందించాలని మహిళలు కోరుతున్నారు.

News December 11, 2025

శ్రీకాకుళం: జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనాలు

image

బూర్జలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ, కోనసీమ, బిహార్‌కు చెందిన నాగరాజు, ఆనంద్, శ్రీను, చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలుకెళ్లారు. బయటొచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బూర్జ. ఆ గ్రామానికి చెందిన రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని శ్రీను గమనించాడు. ఈ నెల 1న అందరూ కలిసి దొంగతనం చేసినట్లు DSP వివేకానంద తెలిపారు.