Andhra Pradesh

News June 3, 2024

ఇంటర్నేషనల్ పోటీల్లో గోదారి కుర్రోడు

image

ఈ నెల 19 నుంచి 23 వరకు నార్త్ అమెరికా లోవాసిటీలో థాయ్‌బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. 80 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలకు భారత్ తరఫున 86 కేజీల విభాగంలో పాల్గొనేందుకు రాజోలుకు చెందిన అశోక్ ఎంపికయ్యాడు. కాగా ఆయన్ను న్యూఢిల్లీ, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సత్కరించి రూ.75 వేల ఆర్థికసాయం అందించారు.
☛ CONGRATS అశోక్

News June 3, 2024

పాడేరు: ఘాట్ రోడ్డులో భారీ వాహనాలు నిషేధం

image

పాడేరు ఘాట్ రోడ్డులోకి సోమవారం ఉదయం నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్టు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మైదాన ప్రాంతం నుంచి పాడేరు, జీ.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర మండలాలకు సిమెంటు, తదితర సామగ్రిని తరలించే భారీ వాహనాలను ముందస్తుగానే ఘాట్ మార్గంలోకి ప్రవేశించకుండా అవసరమైన చర్యలు చేపట్టామని సీఐ వెల్లడించారు.

News June 3, 2024

తూ.గో.: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

image

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద గత నెల 27న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన సత్య (30) విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, భార్య సత్య, కుమార్తె రాధాప్రియ, కుమారుడు రాకేష్, బంధువు గోపితో కలిసి కారులో వెళ్తూ లారీని ఢీ కొట్టి ట్రాలీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

News June 3, 2024

కృష్ణా: నిఘా నీడలో ఓట్ల లెక్కింపు

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో జరగనున్న కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా 110 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లతో సహా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా సిబ్బంది నియామకాన్ని అధికారులు చేపట్టారు.

News June 3, 2024

వైసీపీపై వీపీఆర్ ప్రభావం: ఆరా

image

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు వైసీపీని వీడటంతోనే నెల్లూరులో ఆపార్టీపై నెగటివ్ ఇంపాక్ట్ పడిందని ఆరా మస్తాన్ వెల్లడించారు. ఇది విజయసాయి రెడ్డి ఓటమికి దారి తీస్తోందని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. వీపీఆర్ భార్య ప్రశాంతి రెడ్డి కోవూరులో పోటీ చేయడంతో ఆ నియోజకవర్గం వైసీపీకి టైట్‌గా మారిందన్నారు. నెల్లూరు సిటీ, కందుకూరు, ఉదయగిరిపైనా VPR పార్టీ మారిన ప్రభావం పడిందన్నారు.

News June 3, 2024

విశాఖ: నిరుద్యోగుల విక్రయం కేసులో ఏజెంట్ అరెస్ట్

image

కాంబోడియాకు సంబంధించి మానవ అక్రమ రవాణా కేసులో మరో ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రసాద్ గార్డెన్స్‌కు చెందిన బి. మురళిని విచారించారు. మురళి భావన ఫ్యాబ్రికేటర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ అనే ఇన్స్టిట్యూట్‌ను నడుపుతున్నాడు. మురళి కంబోడియా ఏజెంట్‌లకు నిరుద్యోగ యువతను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మురళిపై ఇప్పటికే 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News June 3, 2024

పెద్దపప్పూరు ఎస్‌ఐ శరత్ చంద్ర సస్పెండ్

image

పెద్దపప్పూరు మండలంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శరత్ చంద్ర ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాడిపత్రి రాళ్ల దాడి కేసులో నిందితుడుగా ఉన్న సోమశేఖర్ నాయుడు, కొంత మంది పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట సమీప ప్రాంతాలలో ఉన్నప్పటికీ కదలికలను పసిగట్టక పోవడం, విధులలలో నిర్లక్ష్యం వహించారన్న కారణాలతో ఎస్సైను సస్పెండ్ చేశారు.

News June 3, 2024

తిరుపతి: 11 నుంచి కళాశాలలు ఓపెన్

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని పీజీ(PG) కళాశాలలు ఈనెల 11వ తేదీ నుంచి పునః ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 10వ తేదీ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. వేసవి సెలవులు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని వెల్లడించారు.

News June 3, 2024

ఒంగోలు: కుమారుడిని కాల్చి చంపిన తండ్రి అరెస్ట్

image

కుమారుడిని తుపాకీతో కాల్చిచంపిన కానిస్టేబుల్‌ను 302 సెక్షన్ కింద ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఆర్ కానిస్టేబుల్ కొదమల ప్రసాద్ బాబు గార్డ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ప్రసాద్ కుమారుడు శేషుకమల్ జీతం డబ్బులు డ్రా చేసుకొని ఇంట్లో ఇవ్వమని తండ్రిని అడగ్గా.. ప్రసాద్ నిరాకరించాడు. దీంతో మాటామాటా పెరిగి.. కోపంతో తన సర్వీస్ రివాల్వర్‌తో శేషును కాల్చడంతో శేషుకుమార్ చనిపోయాడు.

News June 3, 2024

మంగళగిరిలో లోకేశ్‌కు 20వేల ఓట్లకు పైగా మెజారిటీ: ఆరా మస్తాన్

image

మంగళగిరిలో నారా లోకేశ్‌కు 20వేల ఓట్లకు పైనే మెజారిటీ వస్తుందని ఆరా మస్తాన్ అంచనా వేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మొన్న ఎగ్జిట్ పోల్స్ సమయంలో లోకేశ్ గెలుస్తారని చెప్పిన ఆయన, తాజాగా భారీ మెజార్టీతో లోకేశ్ విజయం సాధిస్తారన్నారు. మంగళగిరిలో ప్రధాన పార్టీల నుంచి నారా లోకేశ్, మురుగుడు లావణ్య బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆరా మస్తాన్ వ్యాఖ్యలపై మీ COMMENT.