India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ బ్లాక్ నుంచి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లకు పోస్టల్ బ్యాలెట్లను అభ్యర్థుల సమక్షంలో ఆదివారం తరలించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అనుకూలంగా ఆయా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అభ్యర్థుల సమక్షంలో పటిష్ట భద్రత నడుమ తరలించారు. ఈ తరలింపు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షించారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు.

జూన్ 4న రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎస్పీ ఆదేశాలు మేరకు కౌంటింగ్ నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా 600 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు కుందుర్పి ఎస్ఐ వెంకట స్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరన్న నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు బుడంపాడు జంక్షన్, తెనాలి, వేమూరు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. నాలుగో తేదీ కౌంటింగ్ ముగిసే వరకు మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారు సహకరించాలన్నారు.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు సముద్ర తీరంలో ఆదివారం సముద్ర స్థానానికి దిగి 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సారవకోట మండలం మర్రిపాడుకి చెందిన జన్ని ఉపేంద్ర(17) భావనపాడులో సముద్రంలో స్నానానికి దిగి ఈత కొడుతుండగా కెరటాలు లోపలికి లాక్కొని తీసుకువెళ్లడంతో మృతి చెందాడు. బాలుడు మృతి చెందాడన్న సమాచారంతో కుటుంబ సభ్యులు భావనపాడు చేరుకొని విలపించారు.

ఓట్ల లెక్కింపు రోజు పాటించాల్సిన నియమ నిబంధనలపై పోటీలో ఉన్న అభ్యర్థులకు చీరాల DSP బేతపూడి ప్రసాద్ ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఆ రోజున నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున నేతలు, కార్యకర్తలతో ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయరాదన్నారు. ప్రత్యర్థులనుద్దేశించి ఎలాంటి విమర్శలు లేదా రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదన్నారు. అభ్యర్థుల ఇళ్లలో వారివారి కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఉండరాదన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు.

గుత్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో ఆదివారం సైబీరియన్ కొంగలు సందడి చేశాయి. చాలా అరుదుగా కనిపించే ఈ కొంగలు కోర్టు ఆవరణలో చెట్లపై కనిపించాయి. దీంతో పక్షుల ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లపై కొంగలు కనిపించాయి. వాటి రాకతో కోర్టు ఆవరణం ఆహ్లాదకరంగా కనిపించింది.

తుగ్గలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన తలారి శ్రీరాములు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి ఆర్ఎస్ పెండేకలుకు వెళ్లే దారిలో ఉన్న తోట వద్దకు వెళ్లిన తలారి ఆదివారం మృతి చెంది కనిపించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

టీడీపీ కూటమి అఖండ విజయం సాధించాలని కోరుతూ ఆదివారం తర్లుపాడు మండలం తుమ్మలచెరువులోని దర్గాలో టీడీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరిలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, గూడూరి తదితరులు దర్శించుకున్నారు.

ఎన్నికల్లో గెలుపోటమలు సహజమని ఎవరు వ్యక్తి గతంగా తీసుకోవద్దని కలెక్టర్ సృజన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎవరన్న అతిక్రమిస్తే తగిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.