Andhra Pradesh

News June 2, 2024

EXIT POLLS: విజయవాడ ఎంపీగా గెలుపెవరిదంటే.?

image

విజయవాడ ఎంపీగా వైసీపీ అభ్యర్థి కేశినేని నాని గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లో రెండూ.. వైసీపీనే సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

కర్నూలు, నంద్యాల MP సీట్లపై ఉత్కంఠను రేకెత్తిస్తున్న Exit Polls

image

ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పలు సర్వే ఏజెన్సీలు కూటమి అధికారంలోకి రాబోతోందని వెల్లడించగా.. మరికొన్ని మరోసారి YCP ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పాయి. మరోపక్క లోక్‌సభ స్థానాల్లోనూ చాలా వ్యత్యాసంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కర్నూలు, నంద్యాల MP స్థానాలను YCP కైవసం చేసుకుంటుందని చాణక్య X సర్వే.. కర్నూలు YCP, నంద్యాల TDP ఖాతాలో పడతాయని సీ-ప్యాక్ సర్వే పేర్కొన్నాయి.

News June 2, 2024

మరోసర్వే.. ప.గో. MP స్థానాల్లో విజయం YCPదే

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని ఏలూరు, నరసాపురం ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని సీ-ప్యాక్ సర్వే అంచనా వేసింది. కాగా నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస శర్మ, వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల బరిలో ఉన్నారు. అటు ఏలూరులో కూటమి నుంచి పుట్టా మహేశ్, వైసీపీ- కారుమూరి సునీల్ పోటీ చేస్తున్నారు.
– మరి మీ కామెంట్..?

News June 2, 2024

EXIT POLLS: గుంటూరు ఎంపీగా గెలుపెవరిదంటే.?

image

గుంటూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయులు విజయం సాధిస్తారని పేర్కొంది. మరోవైపు, బాపట్ల ఎంపీగా నందిగం సురేశ్ గెలవనున్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలోని 3 ఎంపీ స్థానాల్లో 2 టీడీపీ, ఒకటి వైసీపీ సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

Exit polls: నెల్లూరు రూరల్‌లో గెలిచేది ఎవరంటే..!

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొంచెం బార్డర్‌కు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని, చివరిగా వైసీపీ గెలిచే చాన్స్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు పోస్ట్ పోల్ సర్వే టీడీపీయే గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.

News June 2, 2024

మరోసర్వే.. తూ.గో. 2 MPలు వైసీపీ, ఒకటి TDP

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి MP స్థానాల్లో YCP, అమలాపురంలో TDP విజయం సాధిస్తుందని సీ-ప్యాక్ సర్వే అంచనా వేసింది. కాగా కాకినాడలో కూటమి నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ బరిలో ఉన్నారు. అటు రాజమండ్రిలో కూటమి- పురందీశ్వరి, వైసీపీ- గూడూరి శ్రీనివాస రావు, అమలాపురంలో కూటమి నుంచి గంటి హరీశ్ మాధుర్, వైసీపీ- రాపాక వరప్రసాద్ పోటీ చేస్తున్నారు.
– మరి మీ కామెంట్..?

News June 2, 2024

చిత్తూరు: రేపటి నుంచి మద్యం విక్రయాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఆయేషాబేగం తెలిపారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగవని పేర్కొన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో శనివారం కూడా జిల్లాలో మద్యం దుకాణాలు మూసేశారు.

News June 2, 2024

నంద్యాల: 6 సార్లు ఎమ్మెల్యే.. 7వ సారి గెలుపుపై Exit Polls Opinion

image

పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేయగా.. వైసీపీ అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి గెలుస్తారని మరో సర్వే చాణక్య X పేర్కొంది. ఇక్కడ టీడీపీ నుంచి గౌరు చరితా రెడ్డి, వైసీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే రాంభూపాల్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సర్వేలపై మీ COMMENT

News June 2, 2024

ప్రకాశం: రోడ్డు దాటుతుండగా లారీ ఢీ.. స్పాట్ డెడ్

image

బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొప్పెరపాడు గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 2, 2024

బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం

image

బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం బొబ్బిలి ఎస్సై చదలవలస సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గల రాముడువలస గ్రామ శివారులో తోటపల్లి కెనాల్ గట్టు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించింది. అతని వయస్సు సుమారు 45 నుంచి 50 సంత్సరాలు ఉంటుందని తెలిపారు. స్థానిక వీఆర్వో అలజంగి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.