Andhra Pradesh

News March 11, 2025

GNT : లాడ్జిలో కిడ్నాప్, హత్యాయత్నం .. కారణమిదే.!

image

గుంటూరులోని లాడ్జిలో వ్యక్తిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు వివాహేతర సంబంధంమే కారణమని తెలుస్తోంది. మప్పాళ్లలోని చాగంటివారిపాలెం వాసి రామలింగేశ్వరరావు అదే ప్రాంత మహిళతో సంబంధం ఉంది. సోమవారం అతను మహిళతో లాడ్జిలో ఉండగా .. గమనించిన బంధువులు ఫాలో చేసి పట్టుకుని కొట్టి తీసుకెళ్లారు. లాలాపేట పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

News March 11, 2025

విజయనగరం జిల్లాలో ఈ మండలాల్లో ప్రజలు జాగ్రత్త

image

జిల్లాలోని 16 మండలాల్లో మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు APSDMA తెలిపింది. బాడంగి(39.3), బొబ్బిలి(39.3), బొండపల్లి(37.8), దత్తిరాజేరు(38.6), గజపతినగరం(38.2), గంట్యాడ(37.3), గరివిడి(39.3), గుర్ల(37.7), మెంటాడ(38.1), మెరకముడిదాం(38.9), రాజాం(39.6), రామభద్రపురం(38.7), రేగిడి ఆముదాలవలస(40.3), సంతకవిటి(39.5), తెర్లాం(39.8), వంగర(40.4) డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

News March 11, 2025

హయగ్రీవ భూములలో బోర్డులు పాతిన అధికారులు

image

ఎండాడలో హయగ్రీవ డెవలపర్స్‌కు కేటాయించిన 12 ఎకరాల 51 సెంట్ల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వృద్ధులకు ఓల్డేజ్ హోం నిర్మాణం పేరుతో తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు విచారణలో తేలింది. దీంతో వెంటనే ఈ భూమి స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు ఆ భూమిలో బోర్డులు పాతారు.

News March 11, 2025

నెల్లూరు: కలెక్టరేట్‌లో ఉచితంగా భోజనాలు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్‌లో జరిగే PGRSకు ప్రజలు ప్రతి సోమవారం వస్తూ ఉంటారు. భోజన సమయం అయ్యేసరికి చేతిలో ఉండీ, లేక చాలామంది పస్తులు ఉంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కలెక్టర్ ఆనంద్ అర్జీదారులకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరూ కడుపునిండా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఆనంద్‌ను ప్రజలు అభినందిస్తున్నారు.

News March 11, 2025

మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

image

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 35°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.

News March 11, 2025

అవనిగడ్డ సబ్ ట్రెజరీలో అవినీతి..ఇద్దరిపై సస్పెన్షన్

image

అవనిగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం వెలుగు చూసింది. ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తప్పుడు బిల్లులతో రూ.1.58 కోట్లు మళ్లించినట్లు గుర్తించి సీనియర్ అకౌంటెంట్ వెంకటరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. అలాగే, అవినీతిని గుర్తించలేకపోయిన ఎస్‌టిఓ ఆదిశేషుపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు.

News March 11, 2025

విశాఖలోని 13 రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని 13 రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు.(రూ/కేజీలలో) టమాటా కేజీ రూ.13, ఉల్లి రూ.27, బంగాళాదుంప రూ.15, నల్లవంకాయలు రూ.30, బెండకాయలు రూ.42, మిర్చి రూ.32, దొండ రూ.38, బరబాటి రూ.38, క్యారెట్ రూ.30/38, వెల్లుల్లి రూ.90/100గా, బీట్ రూట్ రూ.24, కీరా రూ.22, గ్రీన్ పీస్ రూ.50, పెన్సిల్ బీన్స్ రూ.50, కాకర కాయ రూ.44, పొటల్స్ రూ.90, చేమదుంప రూ.34గా నిర్ణయించారు.

News March 11, 2025

గుంటూరు: జీబీఎస్ కలకలం.. 3కు చేరిన మృతులు

image

గుంటూరులో జీబీఎస్ మరణాల సంఖ్య మూడుకు చేరింది. పల్నాడు జిల్లా మాదలకు చెందిన సీతామహాలక్ష్మి (50) ఈనెల 5న జీజీహెచ్ లో చేరారు. కాగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీబీఎస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

News March 11, 2025

శ్రీకాకుళంలో నిండు గర్భిణి మృతి..ప్రమాదం ఎలా జరిగిందంటే

image

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన శ్రీకాకుళంలో జరిగిన విషయం తెలిసిందే. ఎచ్చెర్ల (M) కుంచాలకూర్మయ్యపేటకు చెందిన దుర్గరావు భార్య రాజేశ్వరి నిండు గర్భిణి. సోమవారం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా డే అండ్ నైట్ కొత్త జంక్షన్ వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. భర్తపై బైక్ పడిపోగా, ఆమె తొడ భాగంపై నుంచి బస్సు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

News March 11, 2025

ఎచెర్ల: స్పెషల్ డ్రైవ్ పరీక్షఫలితాలు విడుదల

image

ఎచ్చెర్ల మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల ఇయర్ ఎండింగ్ స్పెషల్ డ్రైవ్ పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలు https://www.vidyavision.com/results/DRBRAUUG1st2nd3rdsemResults వెబ్‌సైట్‌ సందర్శించాలని తెలిపారు.