Andhra Pradesh

News March 11, 2025

తూ.గో.జిల్లా ప్రజలారా ఇవాళ జాగ్రత్త.!

image

తూ.గో.జిల్లా ఇవాళ వేడెక్కనున్నది. ముఖ్యంగా భానుడు తన ప్రతాపాన్ని జిల్లాలోని సీతానగరం 38.6, తాళ్లపూడి 38.5, గోపాలపురం 38.4, గోకవరం 38.3, కోరుకొండ 38.3, రాజమండ్రి 37.9, రాజానగరం 37.5, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి వృద్ధులు, పిల్లలు జాగ్రతగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 11, 2025

ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్‌

image

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ (జేఎఫ్‌సీఎం) అపర్ణ డిస్మిస్‌ చేశారు. మరోవైపు బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేశారు. నేడు వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత ఫిర్యాదుతో గతేడాది ఆదోని పీఎస్‌లో పోసానిపై కేసు నమోదైంది.

News March 11, 2025

నెల్లూరు: నీటిపారుదల పైపుల ఏర్పాటుకు రూ.35 లక్షలు మంజూరు

image

జాతీయ పోషకాహార భద్రత పథకంలో భాగంగా చిరుధాన్యాలు, నీటిపారుదల కొరకు పైపుల ఏర్పాటుకు రూ.35 లక్షల నిధులు మంజూరైనట్లు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాలో 70 వేల హెక్టార్లలో రైతుకు ఐదు ఎకరాల చొప్పున రూ.15 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతులు ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.

News March 11, 2025

విజయనగరం జిల్లాలో మైనార్టీలకు గుడ్ న్యూస్

image

ముస్లింలు, క్రైస్త‌వులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీకుల రుణాల‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఆర్‌.ఎస్‌.జాన్ సోమవారం కోరారు. వివిధ బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణాల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు. వ‌య‌సు 21- 55 లోపు ఉండాల‌న్నారు. తెల్ల రేష‌న్ కార్డు, ఆధార్ కార్డుతో ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News March 11, 2025

గుంటూరులో వ్యక్తి కిడ్నాప్

image

లాడ్జిలో వివాహితతో కలిసి ఉన్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి అతణ్ని కిడ్నాప్ చేశారు. లాడ్జి మేనేజర్ తిరుపతి ఫిర్యాదు మేరకు లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. పోలీసుల కథనం.. జిన్నాటవర్ సెంటర్లోని బాలాజీ లాడ్జిలో రామలింగేశ్వరరావు అనే వ్యక్తి ఓ వివాహితతో రూమ్ తీసుకున్నాడు. నలుగురు వ్యక్తులు వచ్చి రామలింగేశ్వరరావుపై దాడి చేసి అతణ్ని తీసుకెళ్లారని తెలిపారు.

News March 11, 2025

జాతీయ స్థాయిలో జిల్లా పేరును మార్మోగించిన అరుణ

image

మాస్టర్స్ అథ్లెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన నేషనల్ లెవెల్ క్రీడల్లో గూడూరు పాఠశాల ఉపాధ్యాయిని మత్తి అరుణ తన అసామాన్య ప్రతిభను చాటారు. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో 4×400 మీటర్స్ రన్నింగ్‌లో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్‌, 4×100 మీటర్స్ రన్నింగ్‌లో సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పేరు జాతీయ స్థాయిలో మార్మోగేలా చేశారని తోటి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.

News March 11, 2025

భీమవరం: ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్

image

ఆన్ లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను ప.గో. జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ జయసూర్య వివరాలు వెల్లడించారు. నలుగురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.13 లక్షల విలువగల 54 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్‌టాప్స్, నెట్వర్కింగ్ డివైసెస్ స్వాధీనం చేసుకున్నారు.

News March 11, 2025

VZM: ఆదర్శ దివ్యాంగ జంటలకు అభినందన

image

ఆద‌ర్శ వివాహం చేసుకున్న దివ్యాంగ జంట‌ల‌ను ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస‌మూర్తి సోమవారం ఆశీర్వ‌దించారు. విజ‌య‌దుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం, హెల్పింగ్ హేండ్స్ హిజ్రాస్ సంస్థ సమక్షంలో రెండు విభిన్న ప్ర‌తిభావంతుల జంట‌ల‌కు వివాహం చేశాయి. జిల్లాకు చెందిన నారాయ‌ణ‌, శ్రీ‌స‌త్య‌ అలాగే సత్య ఆచారి, విజ‌య‌ల‌క్ష్మి ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ రెండు జంట‌ల‌ను శ్రీనివాస్ మూర్తి అభినందించారు.

News March 11, 2025

థాంక్యూ సీఎం సర్ : బీద రవిచంద్ర 

image

శాసనమండలి సభ్యుడిగా రెండోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బీద రవిచంద్ర యాదవ్ ధన్యవాదములు తెలియజేశారు. సోమవారం అసెంబ్లీలో నామినేషన్ వేసిన అనంతరం చంద్రబాబు నాయుడుతో రవిచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.  రవిచంద్రకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. 

News March 11, 2025

కోరుకొండ: ఆకట్టుకుంటున్న నరసింహుడి గిరి

image

రాజానగరం నియోజకవర్గ మండలం ప్రధాన కేంద్రమైన కోరుకొండలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో వైకుంట ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పూట విద్యుత్ దీపా అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ గిరి ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.