India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రాణాపాయం కేసులను ఒకవేళ అడ్మిట్ చేసుకుంటే చికిత్సలో ప్రాణాలు పోతే తమపైకి వస్తుందేమోననే నెపంతో వైద్యులు రిస్క్ తీసుకోకుండా రెఫర్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వసతులు, వైద్యుల కొరత ఉండడంతో GGHకి రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో 108 ద్వారా వచ్చిన అత్యవసర కేసులు పరిశీలిస్తే Sep (3063),OCT(3340), NOV(3024), DEC(559) రాగా.. వీటిల్లో SEP(496), OCT(573), NOV(662), DEC(157) కేసులను వేరే ఆసుపత్రులకు రెఫర్ చేశారు.

నెల్లూరు కార్పొరేషన్కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్లో సమావేశం ఉంటుంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.

ప్రకాశం రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఉగ్ర పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవి భర్తీ చేసి, పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది అధిష్టానం అభిమతం. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ ఉగ్ర పేరు దాదాపు ఖరారు చేయగా, ప్రకాశం రాజకీయం రెడ్డి వర్సెస్ రెడ్డి అంటూ జోరుగా చర్చ సాగుతోంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా మీదుగా పలు స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు ఉంటాయి. 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ -శ్రీకాకుళం రోడ్డు మధ్య 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీల్లోనూ, శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్కు 07295 రైలు జనవరి 14న ట్రైన్స్ నడవనున్నాయి.

విశాఖ నుంచి విమానయాన ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడి నుంచి రోజుకు 28 దేశీయ విమాన సర్వీసులు.. వారానికి 2 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సగటున 8,500-9,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు కలవు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టిటివీ అవసరం ఎంతైనా ఉంది.

టంగుటూరులోని టోల్ ప్లాజాకు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. టోల్ ప్లాజాకు సమీపంలోకి బైక్ రాగానే, అటువైపుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి రహదారిపై బలంగా పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు SCR ప్రకటించింది.
➣జనవరి 9, 11: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07288)
➣జనవరి 10, 12: శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్(07289)
➣జనవరి 10, 12, 16, 18: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07290)
<<18587966>>CONTINUE..<<>>

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబత్రబాగి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్, క్రైమ్, శాంతి భద్రతల విభాగాలకు చెందిన 102 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. మంగళవారం ఉదయం ఐదుగురు ఎస్ఐలను రేంజ్కు అప్పగించగా కొద్ది గంటల్లోనే భారీగా బదిలీలు జరిగాయి. వీరిలో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారికి, ఇతర పరిపాలన కారణాలతో స్థానచలనం కల్పించారు.
Sorry, no posts matched your criteria.