Andhra Pradesh

News March 18, 2024

ప్రకాశం: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

image

అతివేగంగా వస్తున్న బైకు అదుపు తప్పడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మద్దిపాడు ఫ్లైఓవర్‌పై సోమవారం సాయంత్రం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు ఒంగోలు కేంద్రంగా ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పులను వసూలు చేసుకుని తిరిగి ఒంగోలు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను కొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతిచెందాడు.

News March 18, 2024

ప్రత్యర్థులందరూ కొత్తముఖాలే..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.

News March 18, 2024

బత్తలపల్లిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డుకు ఉన్న వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. నర్సింపల్లి రోడ్డు పక్కన ఉన్న వెంకటేశ్‌కు చెందిన వ్యవసాయ పొలంలో విద్యుత్ వైర్ల మరమ్మతుల కోసం ఓ వ్యక్తి స్తంభం ఎక్కాడు. విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. బత్తలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా.. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి: డీఈవో

image

జాతీయ ఉపకార వేతనం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికైన విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో కోరారు. 2019, 2020, 2021, 2022 సంవత్సరాలలో స్కాలర్ షిప్ నకు ఎంపికై ప్రస్తుతం 9 నుంచి ఇంటర్ చదువుతూ రెన్యూవల్ చేయించుకున్న ప్రతి విద్యార్థి తప్పకుండా తమ అకౌంట్ కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని తెలిపారు.

News March 18, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాకు వర్షసూచన

image

ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలకు వాతవరణ శాఖ తీపికబురు చెప్పింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News March 18, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ఈ నెల 20వ తేదీన వర్షం పడే అవకాశముందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(APSDMA) అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశముంటుందని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 18, 2024

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు: కలెక్టర్

image

వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. అలా ఎవరైనా ప్రచారంలో పాల్గొంటే టోల్ ఫ్రీ నెంబర్: 1800 425 7755కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 18, 2024

కోటబొమ్మాలి: స్వేచ్ఛగా ఓటు వేయండి: కలెక్టర్

image

ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును నిర్భ‌యంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి మండలంలో ఆయన రిజర్వు పోలీసు దళాల ఫ్లాగ్ మార్చ్ లో సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఓటర్లు ఎటువంటి భ‌య‌బ్రాంతుల‌కు, ప్ర‌లోభాల‌కు గురికావ‌ద్ద‌ని సూచించారు.

News March 18, 2024

ఆదోనిలో అంత‌ర్రాష్ట్ర సెప‌క్ త‌క్రా పోటీలు

image

రాయలసీమ వర్శిటీ, ఆదోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కళాశాల సంయుక్తంగా ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ త‌క్రా పోటీలు సోమ‌వారం ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో రెండో రోజు కొన‌సాగాయి. రెండో రోజు Apj Abdul Kalam యూనివర్సిటీపై MJPR బరేలి యూనివర్సిటీ, శ్రీ కుషల్ దాస్ యూనివర్సిటీపై అన్నా విశ్వవిద్యాలయం, మాధవ్ యూనివర్సిటీపై ఉస్మానియా యూనివర్సిటీ, గొందావాన్ యూనివర్సిటీపై రాయలసీమ యూనివర్సిటీ జట్లు విజయం సాధించాయి.

News March 18, 2024

కృష్ణా: BSP తొలి అభ్యర్థుల జాబితా విడుదల

image

బహుజన సమాజ్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.. విజయవాడ హనుమాన్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసే తమ 11 మంది లోక్ సభ, 50 మంది శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరం జ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.

error: Content is protected !!