India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పిల్లల సరదాలు కన్నపేగుకు కడుపుకోతను మిగిలుస్తున్నాయి. బొబ్బిలి మండలంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోనంగి సాయి ఏకైక సంతానం కావడంతో అతని తల్లిదండ్రుల ఆర్తనాదాలకు అవధులు లేవు. అటు జామి ఘటనలో మరణించిన షాకిద్ ఖాన్ తల్లిదండ్రులు రోజువారీ కూలీ చేసుకుంటూ చదిస్తున్నారు. ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన ఏకైక మగ సంతానం మహమ్మద్ అస్రాఫ్ మరణవార్త విన్న అతని అమ్మానాన్న శోక సంద్రంలో మునిగిపోయారు.

ప్రియురాలు పుట్టినరోజు నాడు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎలమంచిలిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన రోమాల గంగాధర్(24) చాలా కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఏడాదిగా వీరు మాట్లాడుకోవడం లేదు. సోమవారం ఆమె పుట్టినరోజు కావడంతో ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా.. ఆమె ఫోన్ తియ్యకపోవడంతో మనస్తాపం చెంది అదే రోజు రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై పాపినాయుడు వెల్లడించారు.

తాళ్లూరు మండలంలోని రామభద్రపురానికి చెందిన మణికంఠరెడ్డి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో గల్లంతైన విషయం తెలిసిందే. మణికంఠరెడ్డి తన మిత్రులతో కలిసి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో సరదాగా ఈతకెళ్లి అక్కడ ఈతకొడుతూ లోపలికి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఆరోజు నుంచి గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం మృతదేహం ఒకపక్కకు కొట్టుకొని వచ్చింది. మణికంఠ మృతితో రామభద్రపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చెట్టుపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ చింతారావు (44) మంగళవారం మృతి చెందారు. ఈ నెల 26న ఏలూరుకు చెందిన చింతారావు చెట్టుపై నుంచి పడ్డారు. ఐదేళ్ల క్రితం హత్య కేసులో సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. సత్ప్రవర్తన ఉండటంతో ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంచారు.

చెట్టుపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ చింతారావు (44) మంగళవారం మృతి చెందారు. ఈ నెల 26న ఏలూరుకు చెందిన చింతారావు చెట్టుపై నుంచి పడ్డారు. ఐదేళ్ల క్రితం హత్య కేసులో సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. సత్ప్రవర్తన ఉండటంతో ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంచారు.

ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ గా పరమేశ్వర్ ఫంక్వాల్ నియమితులయ్యారు. ఆయన కాన్పూర్ ఐఐటీలో చదివి 1998లో ఇండియన్ రైల్వే సర్వీస్ ఇంజనీర్గా రైల్వే శాఖలో చేరారు. రైల్వే ట్రాక్ వంతెనలు పర్యావరణ ఇంజనీరింగ్పై ఆయన రాసిన పరిశోధన పత్రాలు పలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితం అయ్యాయి. డెన్మార్క్ స్వీడన్ ఫ్రాన్స్ జర్మనీ చైనా సింగపూర్ తదితర దేశాల్లో పర్యటించి పలు అధ్యయనాలు నిర్వహించారు.

రాజకీయ పార్టీల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఏజెంట్ల కోసం డీఆర్వోలను, ఈవీఎంల లెక్కిపునకు సంబంధించి ఆర్వోలను సంప్రదించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోపు హాజరుకావాలని, పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలన్నారు. 4వ తేదీ సాయంత్రం వరకు రాయకీయ ప్రతినిధుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

మత్స్యకార భరోసా పథకానికి లబ్ధిదారుల ఎంపికను అధికారులు పూర్తి చేశారు. విశాఖ జిల్లాలో 13,530 కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.పదివేలు చొప్పున మొత్తం రూ.13.53 కోట్లను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతుంది. జూన్ 4 తర్వాత పంపిణీ చేస్తారు.

ఇబ్రహీంపట్నం సమీపంలో హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికి సమయం దగ్గర పడుతోంది. ఇందులో భాగంగా నిబంధన ప్రకారం తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గం లెక్కింపు ముందుగా చేపట్టాలి. అతి తక్కువ పోలింగ్ కేంద్రాల 259 ఉన్న ఆమదాలవలసలో ఈవీఎంలను తెరిచి ముందుగా ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఎచ్చెర్ల, టెక్కలి చివరిగా అధికంగా 332 పోలింగ్ కేంద్రాల ఉన్న పాతపట్నం నియోజకవర్గం ఫలితాలు వస్తాయి.
Sorry, no posts matched your criteria.