Andhra Pradesh

News December 30, 2025

పరిశ్రమల స్థాపనే లక్ష్యం: కలెక్టర్ బాలాజీ

image

పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు పొందిన యూనిట్ల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కానూరులో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, సాధ్యమైన వాటిని తక్షణమే పరిష్కరించారు. పరిశ్రమలకు ప్రభుత్వ రాయితీలు సకాలంలో అందించి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.

News December 30, 2025

పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ఆయా శాఖల అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్ఠం చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలన్నారు. వారికి సకాలంలో సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు అందజేయాలన్నారు.

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (1/4)

image

ఈ ఏడాది జరిగిన నేరాల వివరాలను ఎస్పీ నచికేత్ వివరించారు.
✎ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 5406 మందిపై 5379 కేసులు నమోదు
✎ SC, ST అట్రాసిటీ కేసులు గత ఏడాది 78, ఈ ఏడాది 71 నమోదు
✎ ప్రాపర్టీ నేరాల కేసులు 575 నమోదు. వాటిలో 330 కేసుల ఛేదింపు. పోగొట్టుకున్న సొత్తు విలువ రూ.8.59 కోట్లు.. రికవరి రూ.4.15 కోట్లు
✎ డ్రంకెన్ డ్రైవ్‌‌లో 1713 కేసులు నమోదు. 1,251 కేసుల్లో జరిమానా, 49 మందికి జైలు శిక్ష.
<<18714494>>CONTINUE<<>>

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (2/4)

image

✎ అక్రమ ఎర్రచందనం రవాణాలో 9 కేసులు నమోదు చేసి 55 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 1979 కేజీల 139 దుంగలను, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
✎ గంజాయి విక్రయాలపై చేసిన దాడుల్లో 22 కేసులు నమోదు చేసి 67 మందిని అరెస్ట్ చేశారు. 46.27 కిలోల గంజాయిని స్వాధీనం.
✎ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 77,899 కేసులు నమోదు చేసి రూ.2,06,82,743 జరిమానాలు విధించారు.
<<18714488>>CONTINUE<<>>

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (3/4)

image

✎ సైబర్ నేరాలలో 57 కేసులు నమోదు, 33 కేసులు ఛేదించి రూ.3.05 కోట్లు రికవరీ/ఫ్రీజ్.
✎ జూదాలలో 458 గ్యాంబ్లింగ్, 240 మట్కా, 40 క్రికెట్ బెట్టింగ్, 29 కోడిపందేలలో కేసులు నమోదయ్యాయి. 3,473 మంది అరెస్ట్ కాగా.. రూ.1,65,57,268 స్వాధీనం.
✎ 374 అక్రమ మద్యం కేసులు నమోదైతే 423 మందిని అరెస్ట్ చేసి 1450 లీటర్ల మద్యం స్వాధీనం.
✎ మిస్సింగ్ కేసుల్లో 90 శాతం ఛేదింపు.
<<18714484>>CONTINUE<<>>

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (4/4)

image

✎ CEIR పోర్టల్ ద్వారా రూ1.3 కోట్ల విలువైన 1,155 మొబైల్ ఫోన్లు రికవరీ.
✎ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 11 కేసుల్లోని ముద్దాయిలకు జీవిత భైదు, 3 కేసుల్లో 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధింపు.
మొత్తానికి జిల్లాలో నేరాల శాతం తగ్గిందని ఎస్పీ కార్యాలయం తెలిపింది. వచ్చే ఏడాది కట్టుదిట్టచర్యలతో క్రైం రేటును తగ్గిస్తామని జిల్లా ఎస్పీ నచికేత్ పేర్కొన్నారు.

News December 30, 2025

GNT: సారస్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) మస్కట్‌ను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు నల్లపాడు రోడ్డులో సారస్ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. గుంటూరు మిరపకు ప్రసిద్ధి చెందడంతో “మిరప కాయ” నే మస్కట్‌గా ఎంపిక చేసి రూపొందించారని తెలిపారు.

News December 30, 2025

నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

image

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.

News December 30, 2025

2025: కడప జిల్లాలో పెరిగిన మృతుల సంఖ్య

image

కడప జిల్లాలో 2025 సంవత్సరంలో 699 ఘోర, సాధారణ రోడ్డు ప్రమాద కేసులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 351 మంది మృతి. 781 మంది గాయపడ్డారు. 2024లో 633 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా.. 316 మంది మృతిచెందారు. 716 మంది గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఈ ఏడాది రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయని ఎస్పీ పేర్కొన్నారు.

News December 30, 2025

VZM: ‘కూటమి విద్య, వైద్య విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది’

image

కూటమి ప్రభుత్వం నేడు విద్య, వైద్య విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని జిల్లా పరిషత్ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. నేడు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్నే నేడు కూటమి అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారన్నారు. కొత్తగా జిల్లాకు ఏదైనా పరిశ్రమని తీసుకొని వచ్చారా? అని ప్రశ్నించారు.