India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్లవల్లి పారిశ్రామిక వాడలో 405 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా రానున్నాయి. ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు త్వరలో రానున్నాయి. ఒకప్పుడు పల్లెటూరిగా ఉన్న మల్లవల్లి ఇప్పుడు వేగంగా ఓ పట్టణంగా మారబోతుంది.
కందుకూరు టీడీపీ MLA ఇంటూరి నాగేశ్వర రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ‘రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కావాలని MLA కోరగా కాంట్రాక్టర్ ఇవ్వలేదు. పోర్టు పనులకు కంకర, ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీకి వెయ్యి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లతో ఆ వాహనాలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ వ్యవహారం సీఎం ఆఫీసుకు చేరినా ఎమ్మెల్యే దందా ఆపడం లేదు’ అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటున్న ఆయన వాటా కోసం డిమాండ్ చేసినట్లు ఆంధ్రజ్యోతి సంచలన <
గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ బ్యాడ్మింటన్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్ డబుల్స్ విభాగంలో ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజతో కలిసి వరల్డ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు భార్గవ్ను అభినందిస్తున్నారు.
భారత్ -న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. భీమవరం పట్టణంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కొందరు యువకులు దీనిపై క్రికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో 36°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 889 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 35°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
విశాఖలోని ఓ హోటల్లో <<15698756>>మహిళ ఉరి<<>> వేసుకున్న ఘటనలో నిందితుడిని త్రీటౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఉంటున్న పిళ్ల శ్రీధర్ (53)USAలో ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ఫిబ్రవరి 14న విశాఖ వచ్చింది. మార్చ్ 6న హోటల్ మేఘాలయలో కలవాలని అతను బలవంతం చేశాడు. హోటల్లో శ్రీధర్ ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని దీంతో ఆమె ఉరి వేసుకుందని విచారణలో తేలింది.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో కొండలను చీల్చుకుంటూ సూర్యుడు ఇలా బయటకు వచ్చాడు. ఇదే సమయంలో కొండలను తాకేలా మేఘాలు రావడంతో చూపరులను కనువిందు చేసింది. అటుగా వెళ్లిన వాళ్లు ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు.
విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్,సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరుపుతుంటాడని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం తెలిసిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.