Andhra Pradesh

News May 26, 2024

అనంత: ద్విచక్ర వాహనదారుడిని ఆటోతో ఢీ కొట్టి హత్య

image

అనంతపురం పట్టణంలోని రెండో రోడ్డు ఫ్లైఓవర్ కింద ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి వెంబడించి హత్య చేశారు. పోలీసులు తెలిపిన మేరకు శనివారం 11 గంటల తర్వాత రహమత్ నగర్‌కు చెందిన సుగాలి జైపాల్ నాయక్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఆటో తో ఢీ కొట్టి ప్రమాదానికి గురి చేశారు. అనంతరం సిమెంటు దిమ్మెను అతడి తలపై వేసి దారుణంగా హత్య చేశారు.

News May 26, 2024

చింతకొమ్మదిన్నె: బీరు బాటిళ్లు లారీ బోల్తా

image

కడప – రాయచోటి రహదారిలోని గువ్వల చెరువు ఘాట్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 1200 బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయి. పాండిచ్చేరి నుంచి రాయపూర్‌కు బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ ఘాట్ రోడ్డులో ఎదురుగా వస్తున్న సిమెంటు ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో బీరు బాటిళ్లు ధ్వంసం అయ్యాయని, ఇద్దరు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

News May 26, 2024

చీరాల: సాయం చేయబోయి మృత్యుఒడిలోకి..

image

చీరాల ఆరబిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంపన పవన్ కుమార్ అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈపూరుపాలెం నుంచి చీరాలకు పవన్ కుమార్ బైకుపై వస్తుండగా మార్గమధ్యంలో ఒక యువకుడు లిఫ్ట్ అడిగి తనను రైల్వే స్టేషన్ వద్ద దింపమని కోరాడు. అతడిని ఎక్కించుకొని ఆరబి మీద వెళుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పవన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

News May 26, 2024

మదనపల్లె: మాజీ జడ్జిపై కేసు నమోదు

image

భూవివాదం నేపథ్యంలో మాజీ జడ్జితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. మదనపల్లె రోడ్డులోని కొంత భూమి విషయంలో పట్టణానికి చెందిన మాజీ జడ్జి రామకృష్ణకు ఆయన సోదరుల మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రామచంద్ర, శంకరప్పలపై గత ఆదివారం రామకృష్ణ, అతని అనుచరులు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మాజీ జడ్జితో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News May 26, 2024

కర్నూలు: ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో ఇద్దరు డీబార్

image

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ శనివారం రెండో రోజు జరిగిన పరీక్షలో కర్నూలులో ఇద్దరు విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా డీబార్ చేశారు. ఉదయం ప్రథమ సంవత్సరం పరీక్షలకు 8,970 మంది విద్యార్థులు హాజరు కాగా.. 315 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్ఓ ఎస్విఎస్ గురువయ్య శెట్టి వెల్లడించారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 830 మంది విద్యార్థులు హాజరు కాగా 76 మంది గైర్హాజరయ్యారు.

News May 26, 2024

విజయనగరం యువకుడు ఆత్మహత్య

image

పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్‌తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.

News May 26, 2024

పరవాడలో యువకుడు ఆత్మహత్య

image

పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్‌తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.

News May 26, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి పాలిసెట్ సర్టిఫికేట్ల పరిశీలన

image

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్-2024 రాసిన అభ్యర్థులు ఫీజు చెల్లించిన వారు ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీలోగా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించుకోవాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ, 5 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 10,871 మంది పాలిసెట్ రాశారు. ఇందులో 9,576 మంది అర్హత సాధించారు.

News May 26, 2024

నెల్లూరు: ‘వేమిరెడ్డికి లక్షన్నర మెజార్టీ ఖాయం’

image

ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి 20వేల మెజార్టీ, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్షన్నర మెజార్టీతో గెలుస్తున్నారని సీనియర్ నాయకుడు, అనంతసాగరం మండలం పాతాళపల్లి సర్పంచ్ బిజీ వేముల ఓబుల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న టీడీపీ సునామీ సృష్టించబోతుందన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని చెప్పారు.

News May 26, 2024

రాజంపేట: ‘ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేసిన కోడలు’

image

తన పేరిట ఉన్న ఆస్తి కోసం సొంత కోడలు కిడ్నాప్ చేసిందని రాజంపేటకు చెందిన లక్ష్మి నరసమ్మను చెప్పుకొచ్చారు. బాధితురాలి వివరాల ప్రకారం.. మన్నూరుకు చెందిన తనను తన కోడలు రేవతి వారం రోజుల కిందట కిడ్నాప్ చేసి రాయచోటికి తీసుకెళ్లిందని వాపోయింది. ఆస్తి కోసం ఆమెను ఇబ్బందులు పెట్టారని, ఏకంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు కూడా పంపారని శనివారం జరిగిన పత్రికా సమావేశంలో వివరించింది.