India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరాటేలో కర్నూలు జిల్లా యువకుడు బద్రీనాథ్ రెడ్డి సత్తా చాటుతున్నారు. కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి బద్రీనాథ్ రెడ్డి అండర్-19 విభాగంలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న వెల్లడించారు. ఇటీవల రాజంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో తన ప్రతిభతో ఆకట్టుకున్నారని తెలిపారు. విద్యార్థిని కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.
జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ఆర్ఎఓ పి.దుర్గా రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెలవు రోజుల్లో విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులకు సహాయపడుతూ బాధ్యతగా ఉండాలని కోరారు. బైక్ రైడింగ్లు, బీచ్లకు గాని వెళ్లరాదన్నారు
కాకినాడ జగన్నాథపురం చెక్కావారి వీధిలో పండ్ల వ్యాపారి శివమణి తన బిడ్డను <<14248309>>చంపేసిన<<>> విషయం తెలిసిందే. చెడు వ్యసనాలకు బానిసైన అతను తన మగబిడ్డను వైజాగ్లో అమ్మేశాడు. భర్త చనిపోయి నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయగా ఆడబిడ్డ పుట్టింది. ఆబిడ్డను అమ్మేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనకపోవడంతో కోపంతో చిన్నారిని గోడకేసి కొట్టి హతమార్చాడు. నిందితుడిని వన్ టౌన్ సీఐ నాగ దుర్గారావు అరెస్ట్ చేశారు.
సినీ హీరోయిన్లు పాయల్ రాజపుత్, నబా నటేశ్ రేపు అనంతపురం రానున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లను నిర్వాహకులు సిద్ధం చేశారు. తమ అభిమాన హీరోయిన్లు వస్తుండటంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏలూరు జిల్లాలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈవో అబ్రహం సూచించారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నిర్ణీత వేళకు పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సిందే. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం గంట ముందుగా అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు.
సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి చెందిన పోతుమాల అప్పన్న(37)అనే యువకుడు దుబాయిలో మృతిచెందాడు. జీవనోపాధి నిమిత్తం దుబాయిలో గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న ఈయన గత నెల 5వ తేదీన అక్కడ ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 19న మృతిచెందాడు. అయితే కేంద్ర, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చొరవతో అక్టోబర్ 1న మృతదేహం స్వగ్రామం చేరుకుంది.
వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని విడుదల చేశారు. పార్టీకి సంబంధించి డాక్టర్స్, విద్యార్థి, ఇంటలెక్చువల్ విభాగాలకు సంబంధించి నియామకాలు చేపట్టారు. ఇందులో డాక్టర్స్ విభాగానికి సిక్కోలుకు స్థానం లభించింది.
దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.
దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.
టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా అనంతపురంలో కిలో రూ.70కి పైగా పలుకుతోంది. మూడో రకం సైతం రూ.50 పలుకుతుండటం విశేషం. నిన్న కక్కలపల్లి టమాటా మార్కెట్కు 675 టన్నులు రాగా గరిష్ఠంగా కిలో రూ.74, రెండో రకం రూ.65తో విక్రయాలు సాగాయి. 15 కిలోల బుట్ట నాణ్యతను బట్టి రూ.750 నుంచి రూ.1,110 వరకు పలుకుతోందని మార్కెట్ కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. టమాటా కొనాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.
Sorry, no posts matched your criteria.