Andhra Pradesh

News May 25, 2024

అవగాహన ఉన్న వారిని ఏజెంట్లుగా నియమించాలి: గుంటూరు కలెక్టర్

image

పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్‌పై అవగాహన ఉన్న వారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ హాల్‌లో సంబంధిత టేబుల్ వరకు అనుమతిస్తామని చెప్పారు. సెల్‌ఫోన్లు అనుమతించరని, పేపర్, పెన్ను తీసుకొని వెళ్ళవచ్చన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపుపై పార్లమెంట్ అభ్యర్థులతో శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో సమీక్ష నిర్వహించారు.

News May 25, 2024

శ్రీకాకుళం: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆమదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News May 25, 2024

ఓట్ల లెక్కింపుకు అధికారులంతా సంసిద్ధం కావాలి: డీకే బాలాజీ

image

జూన్ 4న కృష్ణా వర్సిటీలో జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులంతా పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఓట్ల లెక్కింపుపై ఆర్వోలు, ఏఆర్వోలకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. 

News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*పలాసలో 40 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు.*వజ్రపుకొత్తూరు మండల పరిధిలో చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య. *దైవ దర్శనానికెళ్లి కాశీలో గుండె పోటుతో మృతి చెందిన టెక్కలివాసి. *రాష్ట్రంలో పోలైన అత్యధిక బ్యాలెట్ ఓట్లు శ్రీకాకుళం జిల్లాలోనే. *మద్యం మత్తులో డ్రైనేజీలో పడి మృతి చెందిన హిరమండల వాసి. *ఎచ్చెర్ల మండల పరిధిలో బోల్తాపడిన ఇసుక లారీ.*రైల్వే పనుల కారణంగా పాతపట్నం వెళ్లే రైళ్లు రద్దు

News May 24, 2024

కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం హిందూపురం పట్టణ సమీపంలోని బిట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ తో కలిసి పరిశీలించారు.

News May 24, 2024

కౌంటింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చెయ్యండి: కలెక్టర్

image

కౌంటింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూములో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల లైవ్ ఫీడ్‌ను పరిశీలించారు. అనంతరం ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. జేసీ మౌర్య, ట్రైనీ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

News May 24, 2024

సంతమాగులూరు: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

మండలంలోని ఏల్చూరులో బాల ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద గురువారం చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన అంకంశెట్టి పున్నాయమ్మ దీపారాధన చేస్తూ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు నరసరావుపేట వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

News May 24, 2024

శ్రీకాకుళం: ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆముదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

News May 24, 2024

కృష్ణా జిల్లాకు రేపు వర్ష సూచన

image

కృష్ణా జిల్లా పరిధిలో శనివారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని APSDMA స్పష్టం చేసింది.

News May 24, 2024

కౌంటింగ్‌కు రాజకీయ పార్టీల శ్రేణులు సహకరించాలి: ఢిల్లీరావు

image

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల శ్రేణులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలెక్టరేట్లో నేడు ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులకు ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే విధానంలో వివిధ దశలను క్షుణ్నంగా వివరించినట్లు కలెక్టర్ తెలిపారు.